కన్నాయిగూడెం, ఫిబ్రవరి 23 : మేడారంలో భక్తులు శుక్రవారం రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. ఇంటికి వెళ్లేదారిలేక.. అక్కడే ఉండలేక పిల్లలు, వృద్ధులు సహా వేలాది కుటుంబాలు అవస్థపడ్డాయి. శుక్రవారం సాయంత్రం నుంచే ఒక్కసారిగా దారులన్నింటా ట్రాఫిక్ జామ్ కావడంతో మేడారంలోనే బస్సులను నిలిపివేశారు. ఉదయం 5గంటల దాకా బస్సులు కదలవని ఆర్టీసీ అధికారులు చెప్పడంతో చేసేదేంలేక నానా ఇబ్బందులు పడ్డారు.