పాలకుర్తి రూరల్, జనవరి 7:చారిత్రక ప్రసిద్ధిగాంచిన పాలకుర్తి, బమ్మెర, వల్మిడి, సన్నూరు ప్రాంతాలను రూ.60 కోట్లతో పర్యాటకపరంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శ్రీసోమేశ్వరాలయాన్ని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. టూరిజం ఎండీ బీ మనోహర్రావు, జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, ‘ఇన్టాక్’ కన్వీనర్ ప్రొఫెసర్ పాండు రంగారావుతో కలిసి శనివారం పాలకుర్తిలోని సోమనాథుడి కల్యాణ మండపం, బమ్మెరలోని పోతన స్మారక మందిరం పనులను ఎర్రబెల్లి పరిశీలించారు. చెన్నూరులోని త్రికూటాలయాన్ని సందర్శించి, వల్మిడిలో పర్యటించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఎర్రబెల్లి మాట్లాడుతూ వచ్చే మహాశివరాత్రి నాటికి సోమనాథుడి విగ్రహావిష్కరణ, కల్యాణ మండపాన్ని సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్తో ప్రారంభించేందుకు కృషి చేసున్నామన్నారు. రూ.25 కోట్లతో హరిత హోటల్ నిర్మిస్తామని పేర్కొన్నారు.
బమ్మెర పోతన, పాల్కురికి సోమనాథుడు, వాల్మికి నడయాడిన ఈ ప్రాంతంలోని చారిత్రక కట్టడాలకు పూర్వవైభవం తీసుకొస్తున్నామని, రూ.50 కోట్లతో టూరిజం పనులు చేపట్టామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. శనివారం టూరిజం ఎండీ బీ మనోహర్రావు, జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య, ‘ఇన్టాక్’ చైర్మన్ ఫ్రొఫెసర్ పాండు రంగారావుతో కలిసి పాలకుర్తిలోని సోమనాథుడి కల్యాణ మండపం, సోమేశ్వరాలయం, బమ్మెరలోని మహాకవి పోతన స్మారక మందిరం పనులను ఎర్రబెల్లి పరిశీలించారు. చెన్నూరులోని త్రికూటాలయాన్ని సందర్శించి, వల్మీడిలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గతంలో బమ్మెరకు వచ్చిన సందర్భంగా జనగామ జిల్లాలో పర్యాటక పనులకు రూ.40 కోట్లు మంజూరు చేశారని గుర్తు చేశారు.
పాలకుర్తిలో సోమనాథుడి విగ్రహాన్ని, కల్యాణమండపాన్ని వచ్చే నెలలో జరిగే మహాశివరాత్రి సందర్భంగా సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయిస్తామని తెలిపారు. వల్మిడి గుట్టపై చేపట్టిన పర్యాటక పనులను శ్రీరామ నవమికి ప్రారంభించేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ కోరిక మేరకు చెన్నూరులోని చాళుక్యుల కాలం నాటి త్రికూటాలయానికి రూ.కోటి మంజూరు చేసి ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఆలయానికి డబుల్ రోడ్డు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. పాలకుర్తిలో టూరిజం ఆధ్వర్యంలో హరిత హోటల్ నిర్మాణానికి రూ.25 కోట్లతో ప్రతిపాదనలు రూపొందిస్తున్నామని ఎర్రబెల్లి తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో పర్యాటక రంగం పరుగులు పెడుతోందని, యాదాద్రి అద్భుతంగా మారిందన్నారు. రామప్పకు యూనెస్కో అవార్డు వచ్చిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక రంగంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నదన్నారు.
బమ్మెర, వల్మిడిలో మహాకవుల విగ్రహాలు
బమ్మెరలో మహాకవి పోతన 22 అడుగుల విగ్రహాన్ని, వల్మిడిలో వాల్మికి మహాముని విగ్రహల 22 అడుగులతో ఏర్పాటు చేసేలా కృషి చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. పర్యాటక ప్రాంతాలకు డబుల్ రోడ్లు మంజూరు చేశామని, వల్మిడిలో రెండు గుట్టల మధ్య రోప్వే ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమైక్య పాలనలో చారిత్రక ప్రదేశాలు నిర్లక్ష్యానికి గురయ్యాయని, తాను ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి పాలకుర్తి ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. టూరిజం ఎండీ బీ మనోహర్రావు మాట్లాడుతూ పాలకుర్తి ప్రాంతంలో పర్యాటక పనులు చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. మంత్రి ఎర్రబెల్లి ఆదేశాల మేరకు ఈ ప్రాంతానికి పర్యాటక పనులకు అధిక నిధులు కేటాయించనున్నట్లు చెప్పారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ అల్లమనేని నాగేందర్రావు, ట్రాన్స్కో ఎస్ఈ వేణుమాధవ్, ఈఈ రఘువీరారారెడ్డి, మల్లికార్జున్రెడ్డి, స్థపతి నాయలింగం, జడ్పీ సీఈవో వసంత, డీపీఆర్వో ప్రసాద్, శివాజీ, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, జడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాస్రావు, దేవస్థాన చైర్మన్ వీ రాంచంద్రయ్య శర్మ, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, టూరిజం అధికారి గోపాల్రావు, డీఈ జీవన్కుమార్, ఏఈ ధర్మేందర్, ఏడీ శ్రీధర్రావు, స్టేషన్ఘన్పూర్ ఆర్డీవో కే కృష్ణవేణి, తహసీల్ద్థార్ భూక్య పాల్సింగ్, ఎంపీడీవో వనపర్తి ఆశోక్కుమార్, డీఈ చారి, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ వీరమనేని యాకాంతారావు, మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల అశోక్రెడ్డి, జడ్పీ కో ఆప్షన్సభ్యుడు ఎండీ మదార్, వెన్నమనేని మురళీధర్రావు, మేడిద సమ్మిరెడ్డి, సర్పంచ్లు కత్తి సైదులు, పుస్కూరి పార్వతీరాజేశ్వర్రావు, జలగం నాగభూషణం, రంగినేని సత్యనారాయణరావు, బత్తినిగోపాల్, మారం శ్రీనివాస్, కాంట్రాక్టర్లు రవీందర్రెడ్డి, నర్సింహారెడ్డి, డీఈ సంధ్యారాణి, శ్రీనివాస్, కారుపోతుల వేణు, నాసర్, వీరమల్ల రాజు పాల్గొన్నారు.
ఫిబ్రవరి నాటికి పనులు పూర్తి చేయాలి
వచ్చే మహాశివరాత్రి జాతర నాటికి సోమేశ్వరాలయంలో కల్యాణ మండపం పనులను పూర్తి చేయాలని, శివ పార్వతుల కల్యాణం వైభవంగా జరగాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. కల్యాణ మండపంతోపాటు సోమనాథుడి విగ్రహావిష్కరణ, సోమనాథుడి కల్యాణ మండపం పనులను పూర్తి చేయాలన్నారు. ఫిబ్రవరి 18న సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా పనులను ప్రారంభిస్తామన్నారు. మార్చి 31నాటికి వల్మిడిలో రాములోరి కల్యాణ మండపం ప్రారంభిస్తామని చెప్పారు. పర్యాటక పనులు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పనుల్లో ఆలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కవులకు పుట్టినిల్లు పాలకుర్తి..
నియోజకవర్గ కేంద్రమైన పాలకుర్తితోపాటు పలు గ్రామాలు కవులు, కళాకారులకు నిలయమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి ఓ పుణ్యభూమి అని, ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రాతినిధ్యం వహించడం తన అదృష్టమన్నారు. శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం, సన్నూరు శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, మహిమాన్వితమైన వానకొండయ్య లక్ష్మీనర్సింహస్వామి ఆలయం పాలకుర్తి నియోజకవర్గంలో ఉండడం ఈ ప్రాంతానికి గర్వకారణమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటయోదులు చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య, విద్యావేత్త డాక్టర్ చుక్కా రామయ్య, సాహితీవేత్త అంపశయ్య నవీన్లాంటి మహనీయులు పుట్టినగడ్డ పాలకుర్తి అన్నారు. ఈ ప్రాంతాల అభివృద్ధికి రూ.50 కోట్లు ఖర్చు చేస్తున్నామని ఆయన వివరించారు.