వరంగల్ : టీఆర్ఎస్ పాలనలోనే యాదవులు అభివృద్ధి చెందారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. హనుమకొండలోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
యాదవుల ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు.
జనాభా పరంగా యాదవుల సంఖ్య చాలా పెద్దది. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసి ఉచితంగా విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తుందన్నారు.
మీ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్ది వారి భవిష్యత్ను బంగారు మయం చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలు, పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. గత ప్రభుత్వాలు యాదవుల అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. వరంగల్లో యాదవుల సంక్షేమ భవనం నిర్మాణానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.