వర్ధన్నపేట, ఫిబ్రవరి 24: సమైక్య రాష్ట్రంలో వెనుకబడిపోయిన పల్లెలు నేడు కేసీఆర్ పరిపా లనా దక్షతతో ఎంతో ప్రగతి సాధిస్తున్నాయని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రా మంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో జరిగిన వివిధ కులాలకు సంబంధించిన కమ్యూని టీ భవనాలు, మినీ ఫంక్షన్హాల్ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ నిత్యం శ్రమి స్తున్నాడని అన్నారు. ఇందులో భాగంగానే రైతు లు, కులవృత్తులు బాగుండాలనే లక్ష్యంతో ప్రభు త్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. మిషన్ కాకతీయ పథకంలో వేల సంఖ్య లో ప్రభుత్వం చెరువులకు మరమ్మతులు చేసింద న్నారు. ఆయకట్టుకు సాగునీటితో పాటు మత్స్య సంపద పెరిగి ముదిరాజ్లు, బెస్త కులస్తులు ఆర్థికంగా ప్రగతి సాధిస్తున్నారని అన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే నాకు రాజ్యసభ సభ్యుడిగా, శాసనమండ లి డిప్యూటీ చైర్మన్గా అవకాశం కల్పించారన్నారు. నాకు దక్కిన గౌరవం ప్రతి ముదిరాజ్ కులస్తుడికి దక్కుతుందని ఆయన అన్నారు.
గ్రామాల్లోని కుల సంఘాలకు అండగా ఉంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఇల్లంద గ్రామంలో వైశ్య, ముదిరాజ్, గౌడ, యాదవ, మున్నూరుకాపు తదితర కులాలకు సంబం ధించిన కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం రజక కులస్తులు నిర్మించు కుంటున్న మడేలయ దేవాలయాన్ని సందర్శిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే అన్ని కులాలకు భవనాలను నిర్మించి ఇస్తానన్నారు. మడేలయ ఆలయాన్ని పూర్తిస్థాయి లో నిర్మించి ఇచ్చేందుకు తనవంతు సహకారం అందిస్తానని రజక కుల సంఘం ప్రతినిధులకు హామీ ఇచ్చారు. త్వరలోనే పేదలకు సొంత ఇంటి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనున్నదని ఎమ్మెల్యే ర మేశ్ వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ అన్న మనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, వైస్ ఎంపీపీ చొప్పరి సోమలక్ష్మి, ఇల్లంద సర్పంచ్ సుంకరి సాంబయ్య, ఎంపీటీసీలు పిట్టల జ్యోతి, గొడిశాల శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖ న్నా, ఆత్మ చైర్మన్ గోపాల్రావు పాల్గొన్నారు.