నర్సంపేట: తండ్రికి తలకొరివి పెట్టి ఋణం తీర్చుకున్నది ఓ కన్నకూతురు. నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బుచ్చినాయక్తండాలోజరిగింది ఈ సంఘటన. బుచ్చినాయక్తండాకు చెందిన రైతు అజ్మీర చందర్ (51)కమలమ్మ దంపతులకు నలుగురు సంతానం. వీరికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా గత కొన్ని సంవత్సరాల క్రితం కుమారుడు చింటు అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే గత వారం రోజుల క్రితం అజ్మీర చందర్ అనారోగ్యానికి గురయ్యాడు.
ఈక్రమంలో కుటుంబ సభ్యులు చందర్ను పలు ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్య చికిత్సలు అందించారు. ఫలితం లేకపోవడంతో తీవ్ర అనారోగ్యంతో చందర్ శనివారం మృతి చెందాడు. మృతునికి భార్య కమలమ్మ, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కొడుకులు లేకపోవడంతో చిన్న కుమార్తె భారతి తండ్రికి తలకొరివి పెట్టింది.