కాజీపేట, అక్టోబర్ 29 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కాజీపేట 47వ డివిజన్ పరిధి బాపూజీనగర్లోని ఆల్ఫా ఓమెగా చర్చిలో కోతకాల కృతజ్ఞత అర్పణాల పండుగను ఆదివారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చర్చి బిషప్ డాక్టర్ జాన్ మార్కండేయ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, దాస్యం వినయ్భాస్కర్ను ఆశీర్వదించారు. ప్రజా సేవల్లో ముందుండే వినయ్భాస్కర్కు రాబోయే ఎన్నికల్లో క్రైస్తవులందరూ అండగా ఉండాలని సూచించారు. ఈ సందర్బంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సర్వమతాలను సమానంగా చూసే సీఎం కేసీఆర్ నన్ను ఆశీర్వదించి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బరిలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మళ్లీ అవకాశం ఇచ్చారన్నారు. అందరూ ఎన్నికల్లో ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించి, ఆశీర్వదించాలని కోరారు. గతంలో కొంత మంది చాలా ప్రాంతాల్లో మసీదులు, చర్చిలు నిర్మించుకోకుండా అడ్డుతగిలితే ముస్లింలు, క్రైస్తవులకు బీఆర్ఎస్ అండగా నిలిచిందన్నారు. నగరం సర్వమత సమ్మేళనానికి నిదర్శనంగా నిలుస్తున్నదన్నారు. అల్ఫా ఓమెగా చర్చి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. ప్రభువు దయతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అర్హులైన వారికి అందించారన్నారు. కార్యక్రమంలో 47వ డివిజన్ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, 47, 63వ డివిజన్ల అధ్యక్షులు దువ్వ కనకరాజు, బెదరికోట రంజిత్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నార్లగిరి రమేశ్, శిరుమల్ల దశరథం, మహ్మద్ సోని, నయీం జుబేర్, బండి చందర్, మంద శ్రీను, క్రైస్తవులు బోక్క రమేశ్, మహేశ్, ఐలేశ్, కృష్ణ, మొగిలి, కరుణాకర్ పాల్గొన్నారు.
హనుమకొండ : అండగా ఉంటా ఆశీర్వదించండి అని చీఫ్ విప్, దాస్యం వినయ భాసర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం గ్రేటర్ 50, 51, 59వ డివిజన్లలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో కార్పొరేటర్ బోయినపల్లి రంజిత్రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్కు హారతి ఇచ్చి, బొట్టు పెట్టి మరోసారి గెలిపించుకుంటామని సంఘీభావం తెలిపారు. అనంతరం దాస్యం వినయ్భాస్కర్ మాట్లాడుతూ పనిచేసిన ప్రభుత్వానికే మద్దతుగా నిలువాలని కోరారు. సంక్షేమ పథకాల అమలులో పశ్చిమ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపినట్లు తెలిపారు. పేద ప్రజల ఆర్థికాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో వారి అభ్యున్నతికి పాటుపడుతానని తెలిపారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలుకు పదేళ్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని చీఫ్విప్ అభ్యర్థించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, డివిజన్ కార్పొరేటర్లు, అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.