మహబూబాబాద్ రూరల్, మార్చి 23 : మహబూబాబాద్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్గా దామల్ల సుజాత శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సబ్రిజిస్ట్రార్గా విధు లు నిర్వర్తించిన తస్లిమా మహ్మద్ శుక్రవారం కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల దాడిలో పట్టుబడ్డారు.
ఆమె స్థానం లో వరంగల్ జోనల్ కార్యాలయం లో విధులు నిర్వర్తిస్తున్న దామల్ల సుజాతకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు శనివారం ఆమె కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.