బయ్యారం : అనాధ శవానికి సర్పంచ్ దహన సంస్కారాలు( Cremation ) నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. మహబూబాద్ జిల్లా బయ్యారం కాకతీయ నగర్కు చెందన ముత్యాల సత్యమ్మ గత 20 రోజులుగా తిండి , ఆలనా పాలన లేక ఆదివారం మృతి చెందింది.
ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరు లేకపోవడంతో కాలనీ వాసులు, బయ్యారం గ్రామపంచాయతీ సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్ నాయక్ ( Sarpanch Shanti Kisan Naik ) కు సమాచారం ఇవ్వగా స్పందించిన సర్పంచ్ పంచాయతీ ట్రాక్టర్లో తీసుకువెళ్లి దగ్గరుండి దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మానవత్వాన్ని పలువురు కొనియాడారు.