హనుమకొండ, జూలై 7 : రాష్ట్ర విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల లబ్ధి కోసమే తెలంగాణలో పర్యటిస్తున్నారని, ఆయనకు ఇక్కడ అడుగు పెట్టే అర్హత లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. వరంగల్లోని ప్రధాని మోదీ పర్యటనను నిరసిస్తూ సీపీఐ హనుమకొండ, వరంగల్ జిల్లా సమితిల ఆధ్వర్యంలో శుక్రవారం హనుమకొండలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. బాలసముద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి ఏకశిలా పారు వరకు ప్రదర్శన నిర్వహించి, పారు ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ విభజన చట్టంలో పేరొన్న హామీలు అమలు చేయకుండా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉకు పరిశ్రమ, ములుగులో గిరిజన విశ్వవిద్యాలయంతో పాటు రాష్ట్రంలోని కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదని మండిపడ్డారు.
నేడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పటికే కాజీపేటలో ఉన్న పీరియాడికల్ వ్యాగన్ ఓవర్ హాలింగ్ వర్షాప్ స్థానంలో వ్యాగన్ రిపేర్ సెంటర్ అని, తాజాగా వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ అని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహరాష్ట్ర లాతూర్లో, గుజరాత్లో కోచ్ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేశారని, విభజన చట్టంలో పేరొన్న కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో ఎందుకు నెలకొల్పలేదని ప్రశ్నించారు. కోచ్ ఫ్యాక్టరీని మరుగున పరిచేందుకే కేవలం రూ.521 కోట్లతో వ్యాగన్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని, కేవలం ఎన్నికల లబ్ధి కోసమే కాజీపేటలో వ్యాగన్ యూనిట్ పేరుతో మభ్యపెడుతోందని విమర్శించారు. బయ్యారంలో ఉకు పరిశ్రమ వస్తే ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. అలాగే, గిరిజన యూనివర్సిటీ ద్వారా గిరిజన విద్యార్థులకు మేలు జరిగేదన్నారు. మామునూర్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయలేదన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో ఒక పరిశ్రమనూ వరంగల్లో ఏర్పాటు చేయలేదన్నారు.
విభజన హామీలపై తాము ఇప్పటికే ప్రజా పోరుయాత్ర నిర్వహించామన్నారు. అన్ని పార్టీలు కలిసి కేంద్రాన్ని నిలదీయాలన్నారు. ఈ సందర్భంగా సీపీఐ కార్యకర్తలు గో బ్యాక్ నరేంద్ర మోదీ అంటూ, విభజన హామీలు నెరవేర్చాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం పోలీసులు ధర్నా చేస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులు తకళ్లపల్లి శ్రీనివాసరావు సహా నాయకులను అరెస్టు చేసి, సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. కార్యక్రమంలో సీపీఐ హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యదర్శులు కర్రె భిక్షపతి, మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట భిక్షపతి, మద్దెల ఎల్లేశ్, రాష్ట్ర సమితి సభ్యులు మారుపాక అనిల్ కుమార్, మండ సదాలక్ష్మి, ఆదరి శ్రీనివాస్, జిల్లా నాయకులు ఉటూరి రాములు, కర్రె లక్ష్మణ్, గన్నారపు రమేశ్, గుండె బద్రి, మునిగాల భిక్షపతి, కొట్టెపాక రవి, భాషబోయిన సంతోష్, ల్యాదెళ్ల శరత్, మాలోతు శంకర్, మంచాల రమాదేవి, కండె నర్సయ్య, దేవా, దస్రూ పాల్గొన్నారు.