నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి
బాధిత కుటుంబానికి రూ. 3లక్షల ఎల్వోసీ అందజేత
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
దుగ్గొండి/చెన్నారావుపేట: ప్రజల ఆరోగ్యమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డ్ణి అన్నారు. దుగ్గొండి మండలం చలపర్తికి చెందిన దూలం రామకృష్ణకు సర్పంచ్ ముదురుకోళ్ల శారద ఆధ్వర్యంలో రూ. 3 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించేందుకు ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా సహకారం అందిస్తున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కాట్ల కోమలాభద్రయ్య, రేఖంపల్లి, దుగ్గొండి ఎంపీటీసీలు రం పీస సోనీరతన్, మోర్తాల రాజు, టీఆర్ఎస్ మండ ల నాయకుడు ముదురుకోళ్ల కృష్ణ, టీఆర్ఎస్ చలపర్తి అధ్యక్ష కార్యదర్శులు పోలోజు లక్ష్మణచారి, దండు రాజు పాల్గొన్నారు. అలాగే, చెన్నారావుపేట మండలం అమీనాబాద్లో ఇటీవల గ్రామీణ వైద్యు ల సంఘం మాజీ మండలాధ్యక్షుడు రూపురెడ్డి రమణారెడ్డి మృతి చెందగా, బాధిత కుటుంబ స భ్యులను పెద్ది పరామర్శించారు. గతంలో ఆయన వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ. 6 లక్షల ఎల్వోసీని అందించారు. అనంతరం పత్తినాయక్తండా ఒకటో వార్డు సభ్యుడు, అడ్వకేట్ జాటోత్ రవి-మౌనిక వివాహానికి ఎమ్మెల్యే హాజరై ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ బానోత్ పత్తినాయక్, ఎంపీటీసీ కడారి సునీతాసాయిలు, పత్తినాయక్తండా సర్పంచ్ జాటోత్ స్వామినాయక్, టీఆర్ఎస్ నాయకుడు అమ్మ రాజేశ్, అమీనాబాద్, పత్తినాయక్తండా టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నార్లాపురం ఐలయ్య, ధరావత్ రాములు, మేడి రాజ్కుమార్, ఉపాధ్యక్షులు పల్లకొండ తిరుపతి, అన్న రమేశ్, నాయకులు పాల్గొన్నారు.
చెక్కుల పంపిణీ..
నర్సంపేట, డిసెంబర్ 18: ఆడపిల్లల కనీస వివాహ వయస్సు 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచడం శుభపరిణామమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డివిజన్ పరిధిలోని 95 మందికి రూ. 95.11 లక్షలు విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఆయన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వివాహ వయస్సు పెంపుతో ఆడపిల్లల చదువుపై తల్లిదండ్రులు మొగ్గు చూపే అవకాశం ఉంటుందన్నారు. తద్వారా అమ్మాయిలు బాగా చదువుకుని వారి కాళ్లపై వారు నిలబడే అవకాశం ఉంటుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఒత్తిళ్లను అధిగమించి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను రూపాయి ఖర్చు లేకుండా అందిస్తున్నదని కొనియాడారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, నర్సంపేట ఆర్డీవో పవన్కుమార్, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, ఎంపీపీ, జడ్పీటీసీలు పాల్గొన్నారు.
పేదలకు వరం.. కల్యాణలక్ష్మి
నర్సంపేట రూరల్: కల్యాణలక్ష్మి పథకం నిరుపేదలకు వరం లాంటిదని ఎంపీపీ మోతె కళావతి అన్నారు. మండలంలోని గురిజాల, చిన్న గురిజాల, జీజీఆర్పల్లి, మహేశ్వరం, లక్నేపల్లి, ఇటుకాలపల్లికి చెందిన పలువురు లబ్ధిదారులకు ఎంపీపీ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గురిజాల సర్పంచ్ గొడిశాల మమత, ఎంపీటీసీ బండారు శ్రీలత, ఆర్ఐ గునిగంటి రాజ్కుమార్, న్యాయవాది మోటూరి రవి, గొడిశాల సదానందంగౌడ్, చిన్నపెల్లి నర్సింగం, మండల కుమారస్వామి, మోతె పద్మనాభరెడ్డి, అల్లి రవి, కూనమల్ల కట్టయ్య పాల్గొన్నారు.
అనుబంధ రంగాలకు రుణ సదుపాయం
నెక్కొండ: వ్యవసాయ అనుబంధ రంగాలైన పాడి, గొర్రెలు, మేకలకాపరులు, మత్స్యకారులను ప్రభుత్వం రైతులుగా పరిగణిస్తూ రుణ సదుపాయం కల్పిస్తున్నదని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నెక్కొండలో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో ఈ నెల 20న అర్హులైన రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు పంపిణీ చేస్తామన్నారు. సమావేశంలో నెక్కొండ, రెడ్లవాడ సొసైటీ చైర్మర్లు మారం రాము, జలగం సంపత్రావు, వైస్ ఎంపీపీ రామారపు పుండరీకం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సంగని సూరయ్య, నాయకులు సోమయ్య, రాజిరెడ్డి, నరేందర్రెడ్డి, యాకయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, ఉప సర్పంచ్ వీరభద్రయ్య పాల్గొన్నారు..