నయీంనగర్, ఆగస్టు 24 : కాకతీయ విశ్వవిద్యాలయ 22వ స్నాతకోత్సవం గురువారం జరుగనుంది. ఈసారి ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 11 కమిటీలను నియమించగా స్నాతకోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాజరుకానున్నారు. ఉదయం7.20 గంటలకు హైదరాబాద్ నుంచి కేయూకు రోడ్డు మార్గం ద్వారా వస్తారు. 10గంటలకు కేయూ గెస్ట్హౌస్లో వీసీ రమేశ్ స్వాగతం పలుకుతారు.
అల్పాహారం అనంతరం ఉదయం 10.15 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియానికి చేరుకుంటారు. స్నాతకోత్సవం సందర్భంగా ఆమె వేదికపై కీలక ఉపన్యాసం చేస్తా రు. అనంతరం 56మందికి పీహెచ్డీ పట్టా లు, 192 మందికి బంగారు పతకాలు ప్రదా నం చేస్తారు. మధ్యాహ్నం 12.55 గంటలకు గెస్ట్హౌస్కు చేరుకుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటారు. 3గంటలకు కేయూ నుంచి హైదరాబాద్కు రోడ్డు మార్గం ద్వారా వెళ్లారు.