వరంగల్ : అజాంజాహి మిల్లు స్థలంలో వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నిర్మాణం కోసం ప్రభుత్వం స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు అజంజాహి మిల్లు స్థలంలో పటాకులు కాల్చి, మిఠాయిలు పంచారు. డప్పు చప్పుళ్లు, మహిళల నృత్యాలతో మిల్లు ప్రాంగణం హోరెత్తింది.
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం. కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ప్రజాప్రతినిధులు, ఎన్జీవో నేతలు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.