హసన్పర్తి, ఫిబ్రవరి 2 : యువత క్రీడల్లో రాణించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు. గ్రేటర్ 65వ డివిజన్ పరిధిలోని ఎల్లాపూర్లో వర్ధన్నపేట నియోజకవర్గస్థాయి కేసీఆర్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను సీపీ ఏవీ రంగనాథ్, డీసీపీ బారితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కేసీఆర్ ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంతోమంది పేద విద్యార్థులు, క్రీడాకారులకు అండగా నిలవడమే కాకుండా కరోనా విపత్కర పరిస్థితుల్లో వేలాది మంది పేదలకు నిత్యావసర సరుకులు అందించామన్నారు.
యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, కల్పించాలనే లక్ష్యంతో భోజన వసతితో పాటు ఉచిత శిక్షణ ఇచ్చినట్లు వివరించారు. సీపీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. యువత సమాజానికి ఆదర్శంగా ఉండాలని సూచించారు. పేదల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఫౌండేషన్ సెక్రటరీ అరూరి విశాల్ను అభినందించారు.
కార్యక్రమంలో ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ బండ రత్నాకర్రెడ్డి, జడ్పీటీసీ సునీత, కార్పొరేటర్లు దివ్యారాణీరాజూనాయక్, సిరంగి సునీల్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండి రజినీకుమార్, ఆత్మ జిల్లా చైర్మన్ చంద్రమోహన్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ అంచూరి విజయ్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ పాడి మల్లా రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు వీసం సురేందర్రెడ్డి, రాజేశ్వర్రావు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు ఏరుకొండ శ్రీనివాస్, రుద్రోజు మణీంద్రనాథ్, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు దోమల శ్రీనివాస్, రాజేందర్ పాల్గొన్నారు.