ఖిలావరంగల్, ఫిబ్రవరి 27 : వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని రూ.3 వేల కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఆదివారం తూర్పుకోటలో రూ.3కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. త్యాగాల పునాదులపై సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పడిందన్నారు. సీఎం కేసీఆర్ మనసున్న నేత అన్నారు. నియోజక వర్గంలో 3,200మంది గుడిసె వాసులకు పట్టాలిప్పించామన్నారు. 2,200 డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తి కావస్తున్నాయన్నారు. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం సుమారు 2 వేల మందికి రూ.3.50లక్షలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయన్నారు. ఉద్యమ సమయంలో పోలీసు కేసులతో ఆర్థికంగా నష్టపోయిన 100 మంది దళితులకు దళిత బంధు పథకం అందజేశామన్నారు. పనిచేసే కార్యకర్తలను కాపాడుకుంటామన్నారు. బిల్లా కవితాశ్రీకాంత్కు జీడబ్ల్యూఎంసీ కో ఆప్షన్ పదవి ఇస్తామన్నారు.
రోజుకు సుమారు 15 వేల మంది పర్యాటకులు వచ్చే విధంగా చారిత్రక ఖిల్లాను అభివృద్ధి చేస్తున్నామన్నారు. పర్యాటకులు పెరిగితే ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అండదండలతో వరంగల్ను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. అభివృద్ధి నిరోధకులను కోటలోనే బొంద పెడుతామన్నారు. అలాగే, నియోజకవర్గంలోని ప్రజలు ఆర్థికంగా ఎదిగేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. మంత్రి కేటీఆర్తో మాట్లాడి ఆర్పీలకు చీరెలు పంపిణీ చేసి గౌరవ వేతనం అందిస్తున్నామన్నారు. రూ.60 కోట్లతో మోడల్ బస్స్టేషన్, రూ.27 కోట్లతో 14 ఎకరాల్లో మార్కెట్ పనులు పూర్తి చేశామన్నారు. ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణాసురేశ్, బైరబోయిన ఉమాదామోదర్యాదవ్, ఆకుతోట రామ తేజశ్వి తదితరులు పాల్గొన్నారు.
కరీమాబాద్ : ఖిలావరంగల్ మండల పరిధిలోని రేషన్ డీలర్లకు అండగా ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు. క్యాం పు కార్యాలయంలో ఖిలావరంగల్ రేషన్ డీలర్ల సంక్షేమ సం ఘం క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ డీలర్లు ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పని చేయాలన్నారు. బైరి వీరస్వామి, కోరె కుమారస్వా మి, రాముల బాబు, బెజ్జంకి కృష్ణ, గుడిమెల్ల రాజు, దత్తు, ఓం, ఖిలావరంగల్ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.