హసన్పర్తి, సెప్టెంబర్ 27 : వర్ధన్నపేట నియోజక వర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు పోతున్నానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 55 డివిజన్ పరిధిలోని భీమారం, కోమటీపల్లిలో రూ.10 కోట్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ర మేశ్ స్థానిక కార్పొరేటర్ జక్కుల రజితావెంకటేశ్వర్లతో కలిసి బుధవారం శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని విలీన గ్రామాలను సిటీ ని తలపించేలా అధిక నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తానని చెప్పారు. అలాగే నియోజక వర్గాన్ని ఆదర్శ నియోజక వర్గంగా తయారు చేసి, రాష్ట్రంలోనే నంబర్వన్గా నిలిచేటట్లు పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
సబ్బండ వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి అవి అమలయ్యేలా సీఎం కేసీఆర్ కృషి చే స్తూ.. దేశానికే ఆదర్శ తెలంగాణగా నిలుస్తున్నారని వివరించారు. అలాగే లాండ్రి చేస్తున్న వ్యక్తితో లాండ్రీకి ఉచిత విద్యుత్ వస్తుందా, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పథకాలు అందుతున్నాయా? అని అడిగి తెలుసుకొని అనంతరం ఎమ్మెల్యే లాండ్రి చేసి అక్కడున్న వారిని సంతోష పరిచారు. ఈ కార్యక్రమంలో 65 డివిజన్ కార్పొరేటర్ సిరంగి సునిల్, 55 డివిజన్ అధ్యక్షుడు అటికం రవీందర్, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు విక్టర్బాబు, ఎర్రగట్టు గుట్ట ఆలయ చైర్మన్ చింతల లక్ష్మణ్యాదవ్, డివిజన్ యూత్ అధ్యక్షుడు గుంజే సాయి, డివిజన్ ప్రధాన కార్యదర్శి నాయకపు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సుధాకర్, గ్రామ అధ్యక్షుడు రాయికంటి సురేశ్, నాయకులు టీఆర్కే రెడ్డి, ఆరిఫ్ సర్కార్, దేశిని భరత్, పోగుల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్తలకు కంటికి రెప్పలా కాపాడుకుంటా..
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. గ్రేటర్ 55 డివిజన్ పరిధిలోని భీమా రం, కోమటిపల్లి, గ్రామలకు చెందిన గౌడ, బలి యా, యాదవ, మున్నూరు కాపు, ఎస్సీ కుల సం ఘాలు బుధవారం ఎమ్మెల్యే రమేశ్కు మద్దతును ప్రకటించి బీఆర్ఎస్లో చేరగా, వారికి బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రజితావెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.