పరకాల, జనవరి 29 : ప్రజాసంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. హనుమకొండలోని ఎమ్మెల్యే చల్లా నివాసంలో పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. వారికి ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక పక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమాన్ని సమపాళ్లుగా జరిగేలా సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పారు. రైతును రాజు చేసిన ఘనత సీఎం కేసీఆర్దని అన్నారు. రాష్ర్టాన్ని అభివృద్ధిలో దేశానికే రోల్ మోడల్గా తీర్చిదిద్దారని, అన్ని రాష్ర్టాల ప్రజలు తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వైపు చూస్తున్నారని అన్నారు. అభివృద్ధిని చూసే అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తామని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను పార్టీ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి వారధిగా కార్యకర్తలు ఉండాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో బొజ్జం శ్రీకాంత్, యాట చిరంజీవి, బొజ్జం వంశీ, బొజ్జం రాజశేఖర్, సంఘం ఐలయ్య, శానబోయిన భిక్షపతి, యాటకల్ల కుమారస్వామి, సూర బన్ని, బండి చందు. శానబోయిన రాజేశ్ ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నేతాని శ్రీనివాస్ రెడ్డి, గంట సమ్మిరెడ్డి పాల్గొన్నారు.