దామెర, మే 5 : లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండలంలోని సీతారాంపురంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంతో పాటు ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పు డు ప్రజలకు అన్ని విధాలా మేలు కలిగిందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో ఎంపీపీ కాగితాల శంకర్, వైస్ ఎంపీపీ జాకీర్అలీ, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు పోలం కృపాకర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రామకృష్ణ, మాజీ సర్పంచ్ శ్రీనివాస్, శంకర్ పాల్గొన్నారు.