కాశీబుగ్గ, ఏప్రిల్ 2 : రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాదిగలను రాజకీయంగా అణచివేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కట్ల రాజశేఖర్ ధ్వజమెత్తారు. కాశీబుగ్గ చౌరస్తాలో మంగళవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆ ముగ్గురి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భం గా రాజశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని లోక్సభ ఎస్సీ రిజర్వ్డ్ ఒక్క టికెట్ మాదిగలకు అవకాశం ఇవ్వకుండా ద్రోహం చేశారని మండిపడ్డారు. మాదిగలను చి న్నచూపు చూస్తున్న కాంగ్రెస్కు ఈ ఎన్నికల్లో తగి న బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో దొమ్మాటి సాంబయ్య, సింగపురం ఇందిరకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు కోట రాజు, గంగారాపు మల్లన్న, ఇసంపెల్లి రాజు, బిర్రు చిన్న మ హేందర్, మామునూరి అనిల్, పిడకల సంపత్, కోట చంద్రశేఖర్, జన్ను దినేశ్ పాల్గొన్నారు.
పరకాల: పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఒక్కసీటు కూడా కేటాయించకుండా మోసం చేసిందని, వరంగల్లో ఆ పార్టీ అభ్యర్థి ఓటమి ఖాయమని ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి మంద రాజు అన్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించడంపై పరకాలలోని అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఏకు శంకర్, నాయకులు చాతాళ్ల రమేశ్, జిల్లెల్ల మురళి, ఇనుముల పూర్ణయ్య, గజ్జి మధు, గోవిందు రవికుమార్, పరికి విజయ్, రఘు, ప్రసాద్, ప్రదీప్, వినయ్, నాగరాజు, జైపాల్ పాల్గొన్నారు.