సర్పంచ్ ఎన్నికలంటే కాంగ్రెస్కు భయమని అందుకే పదవీ కాలం ముగిసినా ఎన్నికలు వాయిదా వేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్ విమర్శించారు. పంచాయతీ ఎన్నికలను పక్కన పెట్టి అవిశ్వాసాలకు తెర లేపిందన్నారు. కాంగ్రెస్వి అమలు కానీ హామీలని సత్యవతి విమర్శించారు. 50రోజుల్లోనే కరెంట్ కోతలు మొదలయ్యాయని, రైతుబంధుకు రాంరాం చెప్పారన్నారు.
కాంగ్రెస్ మంత్రులు, నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రజల గొంతుకై పోరాటం చేసేది ఒక్క బీఆర్ఎస్ పార్టీయేనన్నారు. బీఆర్ఎస్ను పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. పాలకుర్తి పోరాటాల గడ్డ అని, సైనికుల వలె పని చేసి వరంగల్ ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.