కాజీపేట, మే 27: కాజీపేటలోని 61వ డివిజన్ ప్రశాంత్నగర్ కాలనీలోని పోలింగ్ కేంద్రంలోకి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న పది మంది అనుచరులతో రావడంపై ఓటర్లు ఆగ్రహించారు. ఎలా అనుమతిస్తారని అక్కడున్న పట్టభద్రులు విధుల్లో ఉన్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
నిబంధనల మేరకే వెళ్లారని పోలీసులు చెప్పడంతో ‘సీసీ కెమెరాలు పరిశీలిద్దాం పద.. ఆయనకున్న అదనపు అర్హతలు ఏమిటి?’ అంటూ రాజకీయ నాయకులు, స్థానికులు, ఓటర్లు నిలదీయడంతో పోలీసులు నీళ్లు నమిలారు. ఆ తర్వాత అనుచరులను బయటకు పంపి, అభ్యర్థిని మాత్రమే లోపలికి అనుమతించడంతో వివాదం సద్దుమణిగింది.