కరీమాబాద్, జనవరి 4 : రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను మెచ్చే ప్రతిపక్ష నాయకులు, ప్రజలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో దేశాయిపేటకు చెందిన రిటైర్డ్ లెక్చరర్ రవికుమార్, ఎల్బీనగర్కు చెందిన కోట భాస్కర్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో పార్టీకి ఎదురులేదన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని తెలిపారు. పార్టీ కోసం పని చేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్జోషి తదితరులు పాల్గొన్నారు.
పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి..
నియోజకవర్గ అభివృద్ధితో పాటు పార్టీ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే నన్నపునేని తెలిపారు. క్యాంపు కార్యాలయంలో 12,13వ డివిజన్ సమస్యలపై కార్పొరేటర్లు కావటి కవిత, సురేష్జోషి అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్లోని సమస్యలను గుర్తించి త్వరగా పరిష్కరిస్తానన్నారు. సంక్షేమ పథకాలను గడప గడపకూ తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
రాష్ర్టాభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర మరువలేనిది..
గిర్మాజీపేట : రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు గజ్జెల రాంకిషన్ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులు కలిసి పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, ఉపాధ్యక్షుడు జగదీశ్వర్, సహాయ కార్యదర్శులు తోట చందర్రావు, దుర్గారావు, రామకృష్ణ, సిటీ కార్యదర్శి మధుచంద్ర, నర్సంపేట కార్యదర్శి సత్యనారాయణ, నెక్కొండ అధ్యక్షుడు శ్యాంసుందర్, ఇంటర్ ఎడ్యుకేషన్ ఫోరం అధ్యక్షుడు మహ్మద్మ రఫీ, కార్యదర్శి సందీప్, జిల్లా నాయకులు చిరంజీవి, గంగాధర్, మురళి, రాజేంద్రప్రసాద్, వెంకన్న, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జన్ను ప్రసాద్, కార్యదర్శి సాంబయ్య, కోశాధికారి ఉదయ్, భిక్షపతి, మల్లేశం, అజయ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు శంకేశి రాజేశ్, ఆనంద్, శ్రీధర్, గణేశ్, సుమన్ పాల్గొన్నారు. అలాగే, ఎమ్మెల్యేను మెప్మా పీడీ, డీఎంసీ, టీఎంసీ, సీవోలు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మీ క్లినిక్కు సంబంధించిన క్యాలెండర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ గిరి, బీఆర్ఎస్ నేత గందె నవీన్ తదితరులు పాల్గొన్నారు.