నర్సంపేట, ఆగస్టు 20 : ప్రతిపాక్ష పార్టీల నాయకులకు జెండా ఉన్నా, ఎజెండా లేదని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేట రెడ్డి ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో బీజేపీకి చెందిన నాయకుడు గోగుల రాణాప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో 2500 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే పెద్ది కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నర్సంపేట అభివృద్ధి విషయంలో రాజీపడకుండా అనుకున్నది నేరవేర్చినట్లు తెలిపారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నియోజకవర్గ ప్రజలు తనను నేరుగా అడుగవచ్చన్నారు. ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరిన వారిని కూడా ఇతర కార్యకర్తల మాదిరిగానే సమానంగా చూస్తానన్నారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా రాజకీయం పక్కనపెట్టి సహాయం చేయడానికి 24 గంటలు అందుబాటులో ఉంటానన్నా రు. నర్సంపేటలో ప్రతిపక్షాలకు చోటు లేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను అందించామన్నారు. రాజకీయాల కోసం ప్రతిపక్ష నాయకులు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు.
యువత రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 80 శాతం పూర్తి చేసినట్లు తెలిపారు. గతంలో పోటీ చేసిన నాయకులు చేయని పనులను ఒకేసారి పూర్తి చేశానని అన్నారు. మరోసారి కేసీఆర్ నాయకత్వంలో మరింత అభివృద్ధి చేస్తానన్నారు. కనీసం నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై స్పందించి ప్రెస్మీట్ పెట్టే సమయం కూడా ప్రతిపక్షాలకు ఉండదన్నారు. వారికి అవకాశం ఇవ్వకుండా ప్రతి సమస్యను తానే పరిష్కరించానన్నారు. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో లక్ష మెజార్టీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్, రాష్ట్ర రైతు సంఘం డైరెక్టర్ రాయిడి రవీందర్రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్, నామాల సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ లెక్కల విద్యాసాగర్రెడ్డి, గుంటి కిషన్, ఊడుగుల ప్రవీణ్, ఎంపీపీలు వేములపెల్లి ప్రకాశ్రావు, జడ్పీటీసీ పత్తినాయక్ పాల్గొన్నారు.