సుబేదారి,డిసెంబర్ 12: ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనుచరులను కఠినంగా శిక్షించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ కోరారు. ఇటీవల హ నుమకొండ బాలసముద్రంలోని వరంగల్ పశ్చి మ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ప్రారంభ శిలఫలకాన్ని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన ఘటనపై మంగళవారం ఆయన సీపీ అంబర్ కిశోర్ ఝాకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వినయ్భాస్కర్ మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం, ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే లకు క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేశారన్నా రు. ఇందులో భాగంగా వరంగల్ పశ్చిమ నియో జకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పుర పాలక శాఖ మాజీ మంత్రి కేటీఆర్ 2018 మార్చి 5వ తేదీన ప్రారంభించారని పేర్కొన్నారు.
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది న నాయిని రాజేందర్రెడ్డి క్యాంపు కార్యాలయం లోకి వచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యంగా క్యాంపు కార్యాలయ ప్రారంభ శిలా ఫలకాన్ని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం చట్టరీత్యా రాజ్యంగ విరుద్ధమని వినయ్భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసు కోవాలని ఆయన సీపీని కోరారు. వరంగల్ ఎమ్మె ల్యేగా పదిహేను సంవత్సరాలు పనిచేసిన తాను కానీ, తన అనుచరులు కానీ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని అన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓట ములు సహజమని, ఈ ఎన్నికల్లో ఓడినా ప్రజల మధ్యే ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతానని పేర్కొన్నారు. మేయర్ గుండు సుధారాణి మాట్లా డుతూ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అనుచరు లు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అనేది రాజకీయ ప్రతీకారాలకు నిదర్శమని అన్నారు. ప్ర భుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చట్టపర మైన చర్యలు తీసుకోవాలని సుధారాణి సీపీని కో రారు. దాస్యం వెంట కుడా మాజీ చైర్మన్లు సుంద ర్రాజ్, మర్రి యాద వరెడ్డి, కార్పొరేటర్ నర్సింగ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జనార్దన్ గౌడ్ ఉన్నారు.