NIT | హనుమకొండ చౌరస్తా, ఫిబ్రవరి 20 : వరంగల్ నిట్ స్ప్రింగ్ స్ప్రి 2025 కోసం ముస్తాబైంది. ఈ నెల 28 నుంచి మార్చి 2 వరకు మూడు రోజులపాటు సాంస్కృతిక వేడుకలు జరుగనున్నాయి. గురువారం నిట్లో జరిగిన విలేకరుల సమావేశంలో డైరెక్టర్ బిద్యాధర్ సుబుది వివరాలు వెల్లడించారు. సంగీతం, నృత్యం, కళలు, వినోదం తదితర రంగాల్లో ప్రతిభను వెలికి తీయడానికి వేదికగా స్ప్రింగ్ స్ప్రి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ప్రముఖ కళాశాలల వార్షికోత్సవాల్లో ఒకటిగా పేరున్న నిట్కు.. దేశవ్యాప్తంగా ఉన్న నిట్ కాలేజ్ విద్యార్థులు ఈ మహోత్సవానికి హాజరవుతారని తెలిపారు.
పోటీలు, వర్క్షాప్లు, ప్రో షోలు, మ్యూజిక్ డీజేలు, బైక్ స్టట్స్ లాంటి విభిన్న కార్యాక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అనేక కార్యక్రమాలతో స్ప్రింగ్ స్ప్రి యువతలోని ప్రతిభను, సృజనాత్మకతను ప్రోత్సహించనుంది. ఈ వేడుకలకు మరింత ఉత్సాహాన్ని కలిపేందుకు పద్మశ్రీ బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారు. తన అమోఘమైన హాస్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న సినీ నటుడు, కమెడియన్ బ్రహ్మానందం స్ప్రింగ్ స్ప్రి ప్రారంభించనున్నట్లు డైరెక్టర్ వివరించారు.