ఖిలావరంగల్, మార్చి 2 : గీసుగొండ మండలం ఎలుకుర్తిహవేలి గ్రామాన్ని గురువారం కలెక్టర్ బీ గోపి సందర్శించారు. గ్రంథాలయం, పల్లె ప్రకృతి వనం, రైతు వేదిక, నూతన పంచాయతీ భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ‘మన ఊరు-మన బడి’లో భాగంగా చేస్తున్న అభివృద్ధి పనులను వీక్షించారు. ఇక్కడ నిర్మిస్తున్న నీటి సంపు మోడల్ బాగుందని, అన్ని పాఠశాలల్లో ఇలాగే నిర్మించాలని సీఆర్ఏకు సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు.
పలు రికార్డులను పరిశీలించారు. స్కూల్ గ్రౌండ్ను మరమ్మతు చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో సర్పంచ్ జయపాల్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మాధవరెడ్డి పాల్గొన్నారు. అలాగే మనుగొండ గ్రామంలోని కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. కంటి పరీక్షల వివరాలను వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.