హనుమకొండ, జనవరి 8 : గ్రీవెన్స్ దరఖాస్తులపై దృష్టి సారించి, అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో అదనపు కలెక్టర్లతో కలిసి ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. దరఖాస్తులు పెండింగ్లో ఉంచొద్దన్నారు. వివిధ సమస్యలపై గ్రీవెన్స్కు 60 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సాంబశివరావు, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మేన శ్రీను, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ హరిప్రసాద్, మైనింగ్ విభాగం ఏడీ నర్సిరెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి మధురిమ, మెప్మా పీడీ భద్రునాయక్ పాల్గొన్నారు. కాగా, బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రజా పాలన దరఖాస్తుల కంప్యూటరీకరణ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. అలాగే, జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్లను ఆవిషరించారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులకు ఈ నెల 19న, మండల స్థాయిలో 27న, జిల్లా స్థాయిలో ఫిబ్రవరి 3న సైన్స్ టెస్టులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. టెస్ట్ కన్వీనర్ ప్రొఫెసర్ లక్ష్మీ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పరికిపండ్ల వేణు, జేవీవీ బాధ్యులు రాములు, ఉమా మహేశ్వరరావు, కనకాచారి, మురళీమోహన్, విద్యాదేవి, భిక్షపతి పాల్గొన్నారు. అలాగే, ప్రజాపాలన దరఖాస్తుల కంప్యూటీకరణ, నిర్దేశిత గడువులోగా సీఎంఆర్ లక్ష్యాలను పూర్తి చేయడంపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్లు రాధికా గుప్తా, మహేందర్జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, డీసీఎస్వో వసంత లక్ష్మి పాల్గొన్నారు.
పరకాల : గత ప్రభుత్వం మంజూరు చేసిన గృహలక్ష్మీ లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయాలని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కలెక్టర్ సిక్తాపట్నాయక్ను కోరారు. ఈ మేరకు కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ రాధికాగుప్తాకు పరకాల, నడికూడ, ఆత్మకూరు, దామెర మండలాల ప్రజాప్రతినిధులు వినతి పత్రం అందించారు. పరకాల మున్సిపాలిటీలో 369, పరకాల మండలంలో 240, నడికూడ మండలంలో 391, దామెర మండలంలో 280, ఆత్మకూరు మండలంలో 325 మంది నూతన ఇంటి నిర్మాణాల కోసం తమ పాత ఇళ్లను కూల్చి వేసుకున్నారని తెలిపారు. ఎన్నికల కోడ్ రావడంతో బిల్లుల చెల్లింపులు ఆలస్యమయ్యాయని, కాంగ్రెస్ ఈ పథకాన్ని రద్దు చేయడంతో లబ్ధిదారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, వీరిని ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులుగా గుర్తించాలని కోరారు.
ఖిలావరంగల్ : వరంగల్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్కు 58 దరఖాస్తులు వచ్చాయి. కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకం కింద ఇండ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు చెల్లించాలని పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం, ఖిలా వరంగల్ మండలాల్లోని ఆయా గ్రామాల సర్పంచ్లు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు కలెక్టర్ ప్రావీణ్యకు వినతిపత్రం ఇచ్చారు. లబ్ధిదారులు పాత ఇండ్లను కూలగొట్టి అప్పులు చేసి నూతన ఇళ్ల నిర్మాణం చేపట్టారని, వారు ఆందోళన చెందుతున్నారని, మంజూరు పత్రాలు కూడా లబ్ధిదారులకు మీరే అందజేశారని వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే, తెలంగాణ ఉద్యమంలో జైలు జీవితం గడిపిన వారితోపాటు బైండోవర్ అయిన వారిని కూడా పరిగణలోకి తీసుకోవాలని వరంగల్ ఉమ్మడి జిల్లా ఉద్యమకారుల సంఘం కన్వీనర్, కార్పొరేటర్ మరుపల్ల రవి, ఉద్యమకారులు దిండిగాల సోమేశ్వర్, శంకేసి లింగమూర్తి, బొమ్మగాని కుమారస్వామి, గొలను కొండ ఉపేంద్ర, ముస్కే ప్రమీలతదేవి, పుప్పాల మంజూల, కొడిపాక రమాదేవి, మెంతుల యాదగిరి, నరేశ్, లక్ష్మి, యాకలక్ష్మి తదితరులు కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. అలాగే, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు జిల్లా కేంద్రంలోనే ఇంటి స్థలాలు కేటాయించాలని ఆ కుటుంబాల వేదిక ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. సంగెం మండలం పల్లారుగూడ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 362లో ఊర చెరువు శిఖం భూమిని 1.20 ఎకరాల స్థలాన్ని గోనె కుమారస్వామి ఆక్రమించుకున్నాడని, దీనిపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ కోరారు. కాగా, గ్రీవెన్స్ సెల్కు వచ్చిన వినతులను సత్వరమే పరిష్కరించేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ పీ ప్రావీణ్య ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవోలు వాసుచంద్ర, కృష్ణవేణి, డీఆర్డీవో సంపత్రావు పాల్గొన్నారు.
జిల్లాలో ఎలాంటి జాప్యం లేకుండా సీఎంఆర్ డెలివరీ లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పీ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ అధికారులతో మాట్లాడారు. లక్ష్యాలను పూర్తి చేసేంత వరకు సంబంధిత రైస్ మిల్లులలో తనిఖీలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్వి ని తానాజీ వాకాడే, సివిల్ సప్లయి డీఎం చందన్కుమార్, డీఎస్వో సంధ్యారాణి పాల్గొన్నారు.