ఖిలావరంగల్, డిసెంబర్ 2 : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట వరమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం ఖిలావరంగల్ పడమర కోటలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. పడమర కోటకు చెందిన బండి లక్ష్మికి రూ.1.5లక్షలు, చిట్టిమల్ల దామోదర్కు రూ.2 లక్షలు, పుప్పాల మంజులకు రూ.60వేలు, గాదె శ్రీహరికి రూ.40 వేలు, బంగారు సారంగపాణికి రూ. 42 వేలు విలువైన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నదన్నారు. అనంతరం పడమర కోటలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారికి సూచించారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ప్రభుత్వ దవాఖానలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. కార్యక్రమంలో 37, 38 డివిజన్ల కార్పొరేటర్లు వేల్పుగొండ సువర్ణ, బైరబోయిన ఉమ, ఖిలావరంగల్ తహసీల్దార్ ఫణికుమార్, మాజీ కార్పొరేటర్ బైరబోయిన దామోదర్, శంభునిగుడి కమిటీ చైర్మన్ గజ్జెల శ్యాం, డివిజన్ అధ్యక్షుడు సంగరబోయిన విజయ్, మంద శ్రీధర్రెడ్డి, కందిమల్ల మహేశ్, నాయకులు ఇనుముల మల్లేశం, రావుల రాజేశ్, బొల్లం కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.