హనుమకొండ చౌరస్తా, 7 : వరంగల్ లోక్సభ బీజేపీ అభ్యర్థి అరూరి రమేశ్.. అనకొండ, ఇక్కడి భూములను కబ్జా చేశాడని సీఎం ఏ.రేవంత్రెడ్డి విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం హనుమకొండ కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. తులసి వనంలో గంజాయి మొకలా అరూరి రమేశ్ ఇక్కడ ఉన్నాడని, వరంగల్ ప్రాంతాన్ని పట్టి పీడిస్తున్నాడని విమర్శించారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ఆ పార్టీ నాయకులు చెప్పాలని, సమాధానం చెప్పిన తర్వాతే మోదీ అడుగుపెట్టాలన్నారు. కాజీపేటకు రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ మోడీ లాహోర్కు తరలించాడని, గిరిజన యూనివర్సిటీని పదేళ్ల తర్వాత మొన్న ప్రారంభించారని తెలిపారు. రామప్ప ఆలయాన్ని యునెస్కో గుర్తిస్తే నిధులు ఇవ్వలేదని, వేయిస్తంభాల గుడికి ఇచ్చిన నిధులు ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి మోడీ గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. కాజీపేట రైల్వే జంక్షన్ను రద్దు చేసే పరిస్థితి బీజేపీ తీసుకొచ్చిందన్నారు.
తెలంగాణ వర్సెస్ గుజరాత్ ఫైనల్లో మోడీ, అమిత్షా ఇటు పకన రాహుల్గాంధీ ఉన్నాడని, మే 13న జరిగే మ్యాచ్లో గుజరాత్ను డక్ అవుట్ చేయాలని వరంగల్ ప్రజలకు పిలుపునిచ్చారు. కార్పొరేషన్ అధికారులు వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఎస్టిమేషన్ వేసి తీసుకురావాలని, మామునూరులో ఎయిర్పోర్టు కూడా రానుందని చెప్పారు. కడియం కావ్య కబ్జా చేసేది కాదు.. కష్టాలు తెలిసిన వ్యక్తి అని మంత్రి సీతక అన్నారు. అరూరి రమేశ్ దోచుకొని దాచుకునేందుకు నిలబడ్డాడని విమర్శించారు. బీజేపీ రాముడి పేరుతో ఓట్లు అడుగుతోందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి అన్నారు. కులాలు, ప్రాంతీయ మధ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణరావు, వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ పాల్గొన్నారు.