మహబూబాబాద్, ఆగస్టు 14 : నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర సర్కారు పూర్తి భరోసా ఇస్తున్నదని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. ఆదివారం ఆమె జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 87మందికి రూ.32,23,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితమే రూ.కోటి 14లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసినట్లు తెలిపారు.
అనారోగ్య కారణాలతో ప్రైవే టు దవాఖానల్లో చికిత్స చేయించుకున్న పేదలు ఆర్థికంగా ఇబ్బందిపడొద్దనే సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా ఆదుకుంటున్నట్లు తెలిపారు. నిత్యం ప్రజాసేవ గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ను ప్రజలు మరిచిపోవద్దన్నారు. 57ఏళ్లు నిండిన వారికి నేటి పింఛన్లు అందించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పర్కాల శ్రీనివాస్రెడ్డి, ముత్యం వెంకన్న, జడ్పీ కో ఆప్షన్ మెంబర్ మహబూబ్పాషా, బోడ పృథ్వీరాజ్, పొన్నాల యుగంధర్, బోడ లక్ష్మణ్, బానోత్ రాము, భూక్యా శ్రీనివాస్ పాల్గొన్నారు.