సంగెం, నవంబర్ 22 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి విపక్ష నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని బిక్కోజీనాయక్ తండాకు చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంగళవారం హనుమకొండలోని ఎమ్మెల్యే చల్లా నివాసంలో టీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే చల్లా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే ఇతర పార్టీలు ఖాళీ అయ్యాయన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు.
టీఆర్ఎస్లో చేరిన వారిలో బానోత్ బిచ్చానాయక్(కాంగ్రెస్ మాజీ వార్డు సభ్యుడు), బానోత్ కిషన్(బీజేపీ సీనియర్ నాయకుడు), రవి, బాలు, గుగులోత్ వెంకటేశ్వర్లు, కిషన్, శంకర్, బానోత్ సుమన్, వెంకటేశ్వర్లు, హరిలాల్, వసంత్, తిరుపతి, గుగులోత్ అభిలాష్, నరసింహ, శివ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గూడ సుదర్శన్రెడ్డి, మండలాధ్యక్షుడు పసునూరి సారంగపాణి, ఎంపీటీసీ రంగరాజు నర్సింహస్వామి, మాజీ ఎంపీపీ దొనికెల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.