హనుమకొండ, జూలై 29 : ‘శభాష్.. మీ పని తీరు అద్భుతం. తెలంగాణ మహిళా సంఘాల సభ్యులు దేశానికే ఆదర్శం..’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇటీవల లడక్ వెళ్లి అకడి మహిళలకు శిక్షణ ఇచ్చి వచ్చిన ఓరుగల్లు మహా సమాఖ్యకు చెందిన 15 మంది సభ్యులతో శనివారం హనుమకొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల బలోపేతానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, దాని ఫలితంగానే మన మహిళలు దేశానికే ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. డ్వాక్రా సంఘాల పొదుపు, నిర్వహణ, శిక్షణలో మనమే మేటి అని చెప్పారు. రాష్ట్ర ప్రగతిని దేశానికి చాటి చెప్పాలని.. పథకాల అమలు, అభివృద్ధిలో తెలంగాణ ఇతర రాష్ర్ర్టాలకు దిక్సూచి అన్నారు. – హనుమకొండ, జూలై 29
అద్భుతమైన పనితీరుతో మన మహిళలు ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇటీవల లడక్ వెళ్లి, అకడ శిక్షణ ఇచ్చి వచ్చిన హనుమకొండ పేదరిక నిర్మూలన సంస్థ ఓరుగల్లు మహా సమాఖ్యకు చెందిన 15 మంది మహిళలతో మంత్రి హనుమకొండలోని తన క్యాంపు కార్యాలయం(ఆర్అండ్బీ అతిథి గృహం)లో శనివారం ముఖాముఖి నిర్వహించారు. వారితో గంటన్నర పాటు చర్చించారు. సాధించిన ప్రగతిని చూశారు. వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. వారు శిక్షణ ఇచ్చిన తీరు తెన్నులను అడిగారు. వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. ఏండ్లుగా వారు నిర్వహిస్తున్న శిక్షణా పద్ధతులను కూడా తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు వారివారి అనుభవాలను మంత్రికి ఎర్రబెల్లికి వివరించారు. మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 10 ఉత్తమ ప్రగతి సాధించిన ఆదర్శ సంఘాలతో కలిపి ఓరుగల్లు పరస్పర సహాయక సహకార మహాసమాఖ్య ఏర్పడింది. 18 ఏండ్లుగా ఈ సమాఖ్య పనిచేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి ఏర్పాటు ద్వారా పేద రిక నిర్మూలన, మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నది. 2015లో ఈ సమాఖ్య తెలంగాణలో ఏకైక జాతీయ స్థాయి మానవ వనరుల సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సంస్థలోని దాదాపు 460 మంది రీసోర్స్ పర్సన్లు తగు శిక్షణ పొంది, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తమ అనుభవాలను రంగరించి శిక్షణ ఇస్తున్నట్లు మంత్రి వారు వివరించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ గతంలో ఎన్టీ రామారావు డ్వాక్రా సంఘాలను పెడితే ప్రస్తుతం సీఎం కేసీఆర్ వాటిని బలోపేతం చేశారన్నారు.
దేశంలోనే ఇంత పెద్దఎత్తున సంఘటితమైన మహిళలు తెలంగాణలో తప్ప ఎకడా లేరన్నారు. మహిళలు బాగుపడితే, ఆ కుటుంబం, సమాజం, గ్రామం, రాష్ట్రం, దేశం బాగుపడుతుందని మంత్రి తెలిపారు. అందుకే సీఎం కేసీఆర్ డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తున్నారన్నారు. అనేక రుణాలు ఇప్పిస్తూ మహిళలను పారిశ్రామికంగా ఎదిగేలా చేస్తున్నట్లు తెలిపారు. అనేక పథకాలను మహిళల పేరున వారికే వర్తించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అందుకే ఇవ్వాల మన మహిళా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని మంత్రి వివరించారు. మహిళా సంఘాలు, అలాగే, ఓరుగల్లు మహిళా సమాఖ్య ఇదే పనితీరును కొనసాగిస్తూ, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు వరంగల్ జడ్పీ ఇన్చార్జి సీఈవో, వరంగల్ డీఆర్డీవో సంపత్రావు, సెర్ప్ బాధ్యులు తకెళ్లపల్లి రవీందర్ రావు, ఓరుగల్లు మహా సమాఖ్య మహిళలు, రీసోర్స్ పర్సన్లు , సీనియర్ కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్లు, రాష్ట్ర స్థాయి కమ్యూనిటీ ట్రైనర్స్, ప్రొఫెషనల్ రీసోర్స్ పర్సన్లు, ఎలక్ట్రానిక్ మాస్టర్ ట్రైనర్స్ తదితరులు పాల్గొన్నారు.