హనుమకొండ, జూలై 10 : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఆదివాసీలు, గిరిజనులకు ప్రభుత్వం పోడు పట్టాలు అందజేస్తున్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్వోఎఫ్ఆర్ పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు వరంగల్ జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, ఐటీడీఏ పీవో అంకిత్, డీఎఫ్వో జే వసంత పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాయంపేట మండల పరిధిలోని గంగిరేణిగూడెం, కాట్రపల్లి, సాధనపల్లి, సూర్యానాయక్ తండా గిరిజనులకు 64 ఎకరాల పోడు హకు పత్రాలను అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం దేశంలోఎకడా లేని విధంగా ఆదివాసీలు, గిరిజనులకు భూమి యాజమాన్య హకును కల్పిస్తోందన్నారు. గిరిజనులకు గిరివికాసం కింద బోర్లు వేయనున్నట్లు తెలిపారు. కల్పించిన హద్దుల వరకే సాగు చేసుకోవాలని, అడవులను, చెట్లను నరుకుతూ సాగు చేయవద్దని ఎమ్మెల్యే గిరిజనులకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, స్థానిక గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.