లింగాలఘనపురం, జనవరి26 : తెలంగాణ రాష్ట్రం లో పుట్టిన శిశువు మొదలు వృద్ధుల వరకు ఆరోగ్య సేవలను ఏదో ఒకరూపంలో ప్రభుత్వపరంగా సీఎం కేసీఆర్ అందిస్తున్నారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని నాగారంలో డాక్టర్ దుంబాల లవకుమార్రెడ్డి సొంతంగా రూ.9 లక్షల విలువైన 360 గజాల స్థలాన్ని అందించగా, అదే గ్రామానికి చెందిన దుంబాల శత్రుజ్ఞారెడ్డి జ్నాపకార్థం ఆయన భార్య సావి త్రి, కూతుళ్లు వీణా, వాణి, వనజ, వాసవి తమ సొం తంగా రూ. 16లక్షలు వెచ్చించి హెల్త్కేర్ భవనాన్ని నిర్మించారు. ఈ భవాన్ని గురువారం కడియం శ్రీహరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ బొట్ల భాస్కర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కడియం మాట్లాడు తూ.. జనగామ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ రాజీనామా చేసి, 1987లో రాజకీయ రంగ ప్రవేశం చేశానన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ కా లం మంత్రి పదవిని చేపట్టిన ప్రత్యేకత తనకుందన్నారు. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలు తెలుసుకుంటూ నిస్వార్థంగా నియోజకవర్గం, ఉమ్మడి జిల్లాకు సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. తాను మంత్రిగా ఉన్న సమయంలోనే జనగామను రెవెన్యూ డివిజన్గా, మరో పర్యా యం మంత్రిగా ఉన్న సమయంలోనే జనగాను జిల్లా కేం ద్రంగా చేశానన్నారు.
ఈ మండలం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నానని, అందులో భా గంగానే ఈ గ్రామానికి(నాగారం) చెం దిన 130మంది రైతులకు సాంకేతికం గా రైతుబంధు, రైతు బీమా పథకంలో ఏర్పడిన సమస్యలు తీర్చానన్నారు. అంతేకాకుండా అసంపూర్తిగా నిలిచిన కురుమ సంఘం కమ్యూనిటీ భవనానికి రూ.5లక్షలు, గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కడియం ప్రకటించారు. ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణారెడ్డి, స్థల దాత దుంబాల లవకుమార్రెడ్డి, నిధులు అందించిన దుంబా ల సావిత్రి, వీణా, వాణి, వనజ, వాసవి, సర్పంచ్లు బొట్ల భాస్కర్, చిట్ల స్వరూపారాణి, ఎంపీటీసీ మార్పు కృష్ణవేణి, డాక్టర్లు రాజమౌళి, ఇన్నారెడ్డి, నరసింహారెడ్డి నాయకులు దుంబాల భాస్కర్రెడ్డి, మార్పు శ్రీనివాస్రెడ్డి, కృష్ణారెడ్డి, విజయభాస్కర్, చంద్రమౌళి, మదారు, ఏఎన్ఎం సంపూర్ణ, పుష్ప, ఆశకార్యకర్త భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.