గోవిందరావుపేట, నవంబర్ 4 : గిరిజనులు, ఆదివాసీలు, బంజారాల సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, కాంగ్రెస్ పాలన లో బంజారాలకు చేసింది శూన్యమని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శనివారం మండలకేంద్రంలోని కమ్మ సంఘం ఫంక్షన్హాల్లో బంజారాల ఆత్మీయ సమ్మేళనం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్నాయక్ అధ్యక్షతన నిర్వహించగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవితతో కలిసి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ మోసపూరిత హామీలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని, తప్పుదారి వారు అధికారంలోకి వస్తే కర్ణాటక కష్టాలు మొదలవుతాయన్నారు. రైతులపై ప్రేమ, చిత్త శుద్ధితో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. గిరిజనులకు బీజేపీ అన్యాయం చేసిందని, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో లంబాడ జాతికి వారు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. పదేళ్ల పాటు గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయకుండా కేంద్రంలోని బీజేపీ కాలయాపన చేసి గిరిజనులకు ద్రోహం చేసిందనన్నారు. నీళ్ల కోసం కిలో మీటర్ల కొద్దీ నడిచిన పరిస్థితుల నుంచి రాష్ట్రం వచ్చిన తర్వాత స్వయం పాలన దిశగా అడుగులు పడ్డాయన్నారు. పోడు పట్టాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలిపారు. ములుగు జిల్లా ఏర్పాటు చేసుకొని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ములుగు నియోజకవర్గ అభ్యర్థి నాగజ్యోతిని ప్రజలు, బంజారాలు ఆదరించి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
నాగజ్యోతి గెలుపు ఖాయం : ఎంపీ మాలోత్ కవిత
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే ములుగు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతిని భారీ మెజార్టీతో గెలిపిస్తుందని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4వేల కోట్లతో గిరిజన గ్రామాల్లో తాగునీటి సౌకర్యంతో పాటు సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. లంబాడీల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారన్నారు. ఏజెన్సీలోని తండాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా తండాలను గుర్తించి జీపీ హోదా కల్పించడం ఎంతో శుభపరిణామమన్నారు. నాగజ్యోతి గెలుపును ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్నాయక్ మాట్లాడుతూ నేడు నిర్వహించిన లంబాడీల సమ్మేళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున లంబాడీ మహిళలు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయడం అభినందనీయమని, ఇదే స్ఫూర్తితో నాగజ్యోతిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ఎన్నికల ఇన్చార్జి సాంబారి సమ్మారావు, మండల అధ్యక్షుడు సాయికుమార్, ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, జడ్పీటీసీ తుమ్మల హరిబాబు, మహిళా నాయకురాలు సుమలత, నాయకులు భూక్యా దేవానాయక్, నర్సింహనాయక్, సురేశ్, వాగ, మోహన్రాథోడ్ పాల్గొన్నారు.