హనుమకొండ, మే 25: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ నెల 28వ తేదీన జరుగనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2023 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి అధికారు లను ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పరీక్ష నిర్వహణకు సంబంధిం చిన శాఖలతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ ప్రిలిమ్స్ పరీక్ష రెండు పూటలా ఉంటుందని, మొదటి సెషన్లో ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు, అలాగే రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వ హించనున్నట్లు చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణకు మొత్తం 4 రూట్లలో 11 సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పరీక్షకు 5035 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్ష నిర్వహణకు అవసరమైన లైజెన్ ఆఫీ సర్స్, అసిస్టెంట్ లైజెన్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్, తదితర అధికారులు, సిబ్బందిని నియమించినట్లు సంధ్యారాణి తెలిపారు.
పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి ఇ బ్బంది కలుగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయా లని అదనపు కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి వచ్చేటప్పుడు ఈ-అడ్మిట్ కార్డు, ఐడీ ప్రూఫ్ తీసుకురావాలని అన్నారు. పరీక్ష సమ యానికి 10 నిమిషాల ముందే గేటు మూసివేయన్నుట్లు తెలిపారు. అభ్యర్థులు ముందుగానే సెంటర్కి వచ్చి ఉండా లన్నారు. వేసవి నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌ కర్యం కలగకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు.
సురక్షిత మంచినీరు అందజేయాలన్నారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు. పరీక్షకు హా జరయ్యే అభ్యర్థులు, ఇన్విజిలేటర్ సిబ్బంది ఎవరికీ పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, కాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని చెప్పారు. నిశిత పరిశీలన తదుపరి మాత్రమే పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుంద న్నారు. అభ్యర్థులు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనలు తు.చ. తప్పక పాటించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యూపీఎస్సి ప్రతినిధులు దిలీప్ కుమార్ సింగ్, డీఆర్వో ఎం వాసుచంద్ర, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మేన శ్రీను, శ్రీనివాస్, డీసీవో నాగేశ్వర్ రావు, ఇండస్ట్రీస్ జీఎం హరిప్రసాద్, కలెక్టరేట్ ఏవో ఎస్ కిరణ్ ప్రకాశ్, రెవెన్యూ, పోలీస్, రవాణా, వైద్య తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.