నయీంనగర్, నవంబర్ 30 : హనుమకొండ రాంనగర్లోని కూడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ కార్యాలయంలోకి రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఉదయ్భాస్కర్ చొచ్కుకొని వచ్చి సిబ్బందిని దుర్భాషలాడాడు. ఇదేంటని ప్రశ్నిస్తే ‘అరే నువ్వేంది నాకు చెప్పేది.. నన్నే అడిగే దమ్ముందా.. ఇక్కడ ఏం చేస్తున్నారని దురుసుగా అడిగాడు. వెంటనే డ్రైవర్ సార్ ఇది ఆఫీస్.. ఎందుకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మీకు ఏమైనా సమాచారం ఉంటే వెళ్లి చెక్ చేసుకోండి.. అని సమాధానం చెప్పగా, కోపోద్రిక్తుడైన సీఐ లాఠీతో ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. గాయాలపాలైన డ్రైవర్ను హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించినట్లు తెలిసింది.
న్యూశాయంపేటలో కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ బీఆర్ఎస్ కార్యకర్తలతో ఓటింగ్ మంచిగా జరిగేట్టు చూడండి.. వృద్ధులకు సహాయం చేయండి అని చెప్పే క్రమంలో సీఐ ఉదయ్భాస్కర్ అక్కడికి చేరుకుని ఇక్కడ ఏమి చేస్తున్నారు. మీరు చదువుకున్న వారేనా? అని దురుసుగా మాట్లాడాడు. అక్కడే ఉన్న కొంతమంది ఓటింగ్ కేంద్రానికి తాము చాలా దూరంగా ఉన్నామని, నిబంధనలను ఉల్లంఘించలేదని, తెలుసుకోకుండా ఎందుకు అలా మాట్లాడుతున్నావ్ అంటూ తిరగబడ్డారు. అక్కడే ఉన్న సుందర్రాజ్ యాదవ్ సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
జిల్లాలో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎక్కడా కూడా గొడవలు జరుగలేదు. అ యితే సీఐ ప్రవర్తన చర్చనీయాంశమైంది. ఇలా చేయాల్సిన అవసరం ఏముందని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా, తన కార్యాలయంపై దాడి చేసిన రిజర్వ్ సీఐ ఉదయ్భాస్కర్పై చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు కుడా చైర్మన్ తెలిపారు.