హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 2 : హనుమకొండ బస్స్టేషన్ను రూ.100 కోట్లతో అత్యాధునిక వసతులతో నిర్మించనున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్ అన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆయన సోమవారం హనుమకొండ బస్స్టేషన్ను పరిశీలించారు. ఈ నెల 6న మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా బస్స్టేషన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని చీఫ్విప్ తెలిపారు. 35 ప్లాట్ ఫారాలు, జీ+2 అంతస్తులు, అత్యాధునిక వసతులతో నిర్మించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఆర్ఎం జే శ్రీలత పాల్గొన్నారు.
6న కాళోజీ ఆర్ట్ గ్యాలరీ ప్రారంభం
వరంగల్ : తెలంగాణ వైతాళికుడు, ప్రజా కవి కాళోజీ నారాయణరావు పేరున నిర్మించిన కళాక్షేత్రంలోని ఆర్ట్ గ్యాలరీని ఈ నెల 6న ప్రారంభించనున్నట్లు చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు.నగర పర్యటనకు వస్తున్న మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా కాళోజీ ఆర్ట్ గ్యాలరీని ప్రారంభిస్తామని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆయన గ్రేటర్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి కాళోజీ కళాక్షేత్రాన్ని సందర్శించారు. ఆర్ట్ గ్యాలరీని పరిశీలించారు. 6 పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాళోజీ ఫౌండేషన్ సభ్యుల సలహాలు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, పీవో అజిత్రెడ్డి, ఈఈ భీమ్రావు, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.