హనుమకొండ చౌరస్తా, డిసెంబర్ 24 : ‘విభజన చట్టం హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తోంది.. ఆది నుంచి తెలంగాణ రాష్ట్రంపై అకసు వెల్లగకుతున్న బీజేపీతో ప్రజలకు ఒరిగేదేమీలేదని తేలిపోయింది.. కేంద్రంలో బీజేపీ మళ్లీ వస్తే తెలంగాణకు తీరని నష్టం తప్పదని..’ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. బీఆర్ఎస్ బలోపేతంతోనే దేశానికి ప్రయోజనం.. తెలంగాణను అడగడుగునా అవమానిస్తూ ఇకడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్న బీజేపీకి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఆనాటి ఉద్యమనేత, సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించినవిధంగానే బీఆర్ఎస్తోనే విభజన హామీలు నెరవేరుతాయని వినయ్భాస్కర్ స్పష్టం చేశారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమని అత్యంత దుర్మార్గంగా, అహంకారపూరితంగా రాజ్యసభలో సమాధానమిచ్చిన కేంద్రం మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ హనుమకొండలోని క్యాంపు ఆఫీస్లో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్తో కలిసి శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ సాధ్యం కాదన్న బీజేపీకి తెలంగాణలో స్థానం లేదన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న కలలను బీజేపీ కల్లలు చేసింది.. నూతన సచివాలయానికి సీఎం కేసీఆర్.. అంబేద్కర్ పేరు పెట్టారు, అలాగే నూతన పార్లమెంట్కు కూడా అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ చేసిన చట్టంలో ఉన్న హామీలకే దికు లేకపోతే..ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నట్టా.. లేనట్టా.. అన్ని ప్రశ్నించారు. కోచ్ పరిశ్రమల అవసరం దేశంలో ఇక లేదని అసోం రాష్ట్రంలోని కోక్రాజహార్ ప్రాంతానికి ఎలా కేటాయిస్తారు..? రాజ్యాంగం, దర్యాప్తు సంస్థలపై మోదీ ప్రభుత్వం పదునైన కత్తులతో దాడి చేస్తోందని మండిపడ్డారు. అన్ని గుజరాత్కు తరలించుకుపోతున్న బీజేపీని తెలంగాణ నుంచి తరలించాలి.. కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా పనికిరాడు.. కట్టు కథలు, కహానీలు చెప్పడం తప్ప ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం లేక తోకముడిచాడన్నారు. ఆనాడు రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేస్తే కిషన్రెడ్డి విదేశాలకు పారిపోయాడు.. కేంద్ర మంత్రిగా తెలంగాణకు ఏమి చేయలేడని పేర్కొన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిన విషయంపై అసత్య ప్రచారం చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్రెడ్డి భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణానికి రావాలని సవాలు చేశారు. బయ్యారం ఫ్యాక్టరీ వీలు కాదన్నారు.. ఇప్పుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కుదరదు అంటున్నారు.. వద్దు, రద్దుల విధానాన్ని పాటిస్తూ బీజేపీ అన్ని హద్దులు దాటుతోందన్నారు.
సుదీర్ఘ తెలంగాణ ఉద్యమ ప్రయాణంలో ఎంతో మంది సమైక్యవాదులను మట్టికరిపించిన చరిత్ర తెలంగాణ గడ్డది… ఉద్యమాల గడ్డ ఓరుగల్లు నుంచి రాష్ట్ర విభజన చట్టం హామీల కోసం కొట్లాడుతాం.. మా హకులను సాధించేందుకు కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేశారు. విభజన చట్టంలో పొందుపర్చిన హామీలు నెరవేర్చాలని కోరినందుకు సీఎం కేసీఆర్ కుటుంబంపై ఈడీలను పంపిస్తున్నారు. తొండి సంజయ్ని ప్రజలు నమ్మరు, వాగ్దానాలు విస్మరించడం బీజేపీ పాలసీ అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ ఆనాడు కాంగ్రెస్ పంజాబ్కు తరలిస్తే ఇప్పుడు బీజేపీ ఇవ్వమంటుంది, తెలంగాణ ప్రజలను కాంగ్రెస్, బీజేపీ రెండూ మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజలకు ఈ రెండు పార్టీలపై నమ్మకం లేదని, తెలంగాణ వనరులు దోచుకోవడానికి మళ్లీ చంద్రబాబు వస్తున్నాడని ప్రజలు గమనించాలని సూచించారు. ఆనాడు ఆజంజాహి మిల్లు కిటికీలు, దర్వాజలు చంద్రబాబు అమ్ముకుంటే తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ మిషనరీ అమ్ముకుందని చెప్పారు. ఇకడ చిల్లర రాజకీయాలు చేసే వారిపై మాట్లాడనని వినయ్భాసర్ అన్నారు. ఈ సమావేశంలో కుడా చైర్మన్ సుందర్రాజ్యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మహ్మద్ అజీజ్ఖాన్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకుడు పులి రజినీకాంత్, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, 59వ డివిజన్ అధ్యక్షుడు నీలం సుహాస్, నాయకులు బొల్లికొండ వీరేందర్, పాలమకుల కొమురయ్య పాల్గొన్నారు.
పార్లమెంట్ సాక్షిగా పొందుపరిచిన రాష్ట్ర పునర్విభజన హామీలను అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తోంది.కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు, పనులపై బీఆర్ఎస్ ఎంపీలం పార్లమెంట్ సాక్షిగా మంత్రులను వ్యక్తిగతంగా కలిసి విన్నవించినా దున్నపోతు మీద వానపడ్డట్లు వ్యవహరించడం అత్యంత శోచనీయం. తెలంగాణ విభజన హామీలను నెరవేర్చకపోతే కచ్చితంగా పార్లమెంట్లో కేంద్రంపై యుద్ధం చేస్తాం. మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతూ బీజేపీ యువతను పక్కదారి పట్టిస్తోంది. బీఆర్ఎస్తో దేశాన్ని అభివృద్ధి చేస్తాం, బీజేపీని తరిమికొడుతాం. తెలంగాణలో ఒక్కశాతం లేని చంద్రబాబు, షర్మిల.. బీజేపీ ఆడిస్తున్న నాటకంలో భాగంగానే ఇక్కడికి వస్తున్నారు.
-పసునూరి దయాకర్, వరంగల్ ఎంపీ
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించి కేంద్రానికి అప్పగించినా విభజన హామీలోని గిరిజన విశ్వ విద్యాలయం ఇప్పటివరకూ ఏర్పాటు చేయలేదు. తాతాలిక భవనంలోనైనా తరగతులు ప్రారంభించమని విన్నవించి భవనాన్ని జాకారంలో ఇచ్చినా ఇంత వరకు ప్రారంభించకపోవడం బాధాకరం. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని గతంలో పార్లమెంట్లో లేవనెత్తినా కేంద్రం పట్టించుకోవడంలేదు. తెలంగాణకు మొండిచేయి చూపిస్తోంది. గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రలో ఇచ్చారు, ఇక్కడ ఎందుకు ఇవ్వడంలేదు. కిషన్రెడ్డి బ్రోకర్ మాటలు బంద్ పెట్టాలి.
-అజ్మీరా సీతారాంనాయక్, మాజీ ఎంపీ