డీసీసీబీ సర్వసభ్య సమావేశం ఏకగ్రీవ తీర్మానం
వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర్ర పభుత్వం బేషజాలకు పోవద్దని హితవు
బ్యాంకును లాభాల్లోకి తీసుకొచ్చాం
రూ. 1,470 కోట్ల టర్నోవర్తో సేవలు
చైర్మన్ మార్నేని రవీందర్రావు
సుబేదారి, మార్చి 30: కేంద్ర ప్రభుత్వమే యాసంగి సీజన్లో ధాన్యం కొనాలని ఉమ్మడి వరంగల్ జిల్లా సహ కార కేంద్ర బ్యాంకు మహాజన సభ ఏకగీవ్ర తీర్మానం చేసింది. బుధవారం హనుమకొండ అంబేద్కర్ భవన్ లో బ్యాంకు సర్వసభ్య సమావేశం డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు అధ్యక్షతన నిర్వహించారు. యాసంగి సీజన్లో బేషరుతుగా కేంద్ర ప్రభుత్వమే వరి ధాన్యం కొనుగోలు చేయాలని చైర్మన్ తీర్మానం ప్రవేశ పెట్టారు. పాలకమండలి సభ్యులు, పీఏసీఎస్ చైర్మన్లు ఏకగీవ్రంగా ఆమోదం తెలిపారు. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రప్రభుత్వం బేషజాలకు పోకుండా కొనుగోలు చేయాలని వారు హితవు పలికారు. రైతులకు అండగా నిలవాలని, లేనిపక్షంలో రైతులనుంచి తిరుగు బాటు తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా చైర్మన్ రవీందర్రావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగం సాగుచేస్తున్న వరిధాన్యం కొనే విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొర్రీలు పెడుతున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఎఫ్సీఐ ఉన్నా రైతుల పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
రూ. 1470 కోట్ల టర్నోవర్
బ్యాంకు టర్నోవర్ రూ.1,470 కోట్లకు చేరుకుందని డీసీసీబీ చైర్మన్ మార్నేని అన్నారు. బ్యాంకు పురోగతి కోసం అనేక సంస్కరణలు చేపట్టామని, రైతులు, మహి ళా సంఘాలు, చిరువ్యాపారులకు రుణాలు, పీఏసీఎస్ల బలోపేతానికి ఎరువుల వ్యాపారం, ధాన్యం కొనుగోలు, తక్కువ వడ్డీతో గోల్డ్లోన్లు, హౌసింగ్ లోన్లు.. ఇలా బ్యాంకును లాభాల బాటలోకి తీసుకు వచ్చేందుకు సమష్టిగా కృషి చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం లో 95శాతం రికవరీ ఉందని, పెండింగ్లో ఉన్న రుణాలను వసూలు చేయడంలో బ్యాంకు ఉద్యోగుల కృషి మరువలేనిదని కొనియాడారు. బ్యాంకు పరిధి లోని 70 సహకార సంఘాలకు నాబార్డు నుంచి ప్రత్యేక రుణాలు ఇస్తున్నామని చైర్మన్ గుర్తుచేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా 8 కొత్త బ్రాంచ్లను ఏర్పాటు చేశామని, తమ పాలకవర్గం వచ్చిన తర్వాత బ్యాంకును రూ.14కోట్ల లాభాలకు తీసుకొచ్చామని చైర్మన్ తెలిపా రు. ఈ వార్షిక సంవత్సరం నుంచి మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు. తమ బ్యాంకు సేవలు గుర్తించిన జాతీయ గ్రామీణా వ్యవ సాయ అభివృద్ధి బ్యాంకు అవార్డు ఇచ్చిందని పేర్కొన్నా రు.
పీఏసీఎస్ చైర్మన్లుకు గౌరవ వేతనాలు పెంచాలని సీఎం కేసీఆర్కు విన్నవించిన వెంటనే స్పందించారని చెప్పారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ల పక్షాన రవీందర్రావు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోనే వరంగల్ బ్యాంకు ముందు వరుసలో తీసుకురావడానికి ఉద్యోగులు, పాలకమండలి, పీఏసీఎస్ చైర్మన్లు మరింత ఉత్సాహంతో పని చేయాలని రవీందర్రావు కోరారు. ఈ సమావేశంలో బ్యాంకు వైస్చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి, సీఈవో చిన్నారావు, పాలకమండలి సభ్యులు అన్నమనేని జగన్మోహన్రావు, హరిప్రసాద్, చెట్టుపల్లి మురళీధర్ రావు, దొంగల రమేశ్, డీజీఎం అశోక్, ఏజీఎం స్రవంతి, వరంగల్, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్, జనగామ, భూపాలపల్లి జిల్లాల సహకార శాఖ, వ్యవసాయ శాఖ అధికారులు, పీఏసీఎస్ చైర్మన్లు పాల్గొన్నారు.