నర్సంపేట, సెప్టెంబర్ 4 : ఎల్ఐసీని కేంద్ర ప్రభుత్వం, ఐఆర్డీఏ నిర్వీర్యం చేస్తున్నాయని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ఆరోపించారు. సోమవారం నర్సంపేటలో భారతీయ జీవిత బీమా ఏజెం ట్లు నిరసన దీక్షలు ప్రారంభించారు. వీరికి సంఘీభావం ప్రకటించి ఆయన మాట్లాడారు. పాలసీదారులకు బోనస్ పెంచాలని కోరారు. రుణాలపై వడ్డీలు తగ్గించాలన్నారు. పాలసీలపై జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బూరుగు కమలాకర్, వెంకటనారాయణ, మోహన్రెడ్డి, సుధాకర్, కర్ణాకర్, కుమారస్వామి, ఐలయ్య, వెంకట్రెడ్డి, ప వన్కుమార్, వీరన్న, రమేశ్, భిక్షప తి, శ్రీధర్, సుగుణాకర్, సూర్యప్రకాశ్, రాజలింగం, హుస్సేన్ పాల్గొన్నారు.
అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. నర్సంపేటలోని తెలంగాణ కాలనీలోని వినాయక మండపం వద్ద పూ జలు చేసి అన్నదానం ప్రారంభించారు. సోల్తి సారయ్యగౌడ్, పైడయ్య, గంప రాజేశ్వర్రావు, కౌన్సిలర్ రాజు, అనిల్ పాల్గొన్నారు.
సమాజాన్ని తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఎమ్మెల్యే పెద్ది అన్నారు. పట్టణంలోని మోడల్ ఉన్నత పాఠశాలలో ఎన్ఆర్ఐ పిన్నా భాస్కర్ ఆధ్వర్యంలో గురువులను సన్మానించారు. మొదట డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల బాధ్యత అని అన్నారు. హెచ్ఎం కుమారస్వామి, శ్యాం పాల్గొన్నారు.
పేదలకు భరోసా..
నర్సంపేట రూరల్ : తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం విషం కక్కుతుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మండలంలోని లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నేరుగా లబ్ధిదారుల గ్రామాలకే వెళ్లి ఫించన్ కార్డులు అందిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలును అడ్డుకుంటున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. మండలానికి 1871 నూతన పింఛన్లు మంజూరయ్యాయన్నారు. ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, ఎంపీడీవో అంబటి సునీల్కుమార్రాజ్, వైస్ ఎంపీపీ అజ్మీరా మౌనిక, సర్పంచ్ల ఫోరం మండ లాధ్యక్షుడు కొడారి రవన్న, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు భూక్యా వీరన్న, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మోతె జయపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు మురాల మోహన్రెడ్డి, ఆకుల రమేశ్గౌడ్, సర్పంచ్లు మండల రవీందర్, భూక్యా సైద, బానోత్ సుజాత, దస్రూ, బరిగెల లావణ్య, బొజ్జ యువరాజ్, పలకల పూలమ్మ, శ్రీనివాస్, భూక్యా లలిత, వల్గుబెల్లి రంగారెడ్డి, గాంధీ, మొలుగూరి చంద్రమౌళి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నామాల సత్యనారాయణ, ఈర్ల నర్సింహరాములు పాల్గొన్నారు.