సుబేదారి, అక్టోబర్ 6: మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ నగరానికి విచ్చేసిన సందర్భంగా, హనుమకొండ సుబేదారి ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాల మైదానంలో, ఇద్దరు మం త్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఉమ్మడి వరంగల్జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. శుక్రవారం మంత్రి కేటీఆర్ హైదరాబాద్నుంచి హెలికాప్టర్లో సుబేదారి ఆర్ట్స్ అండ్ కళాశాల మైదానం కు ఉదయం 10:40 చేరుకున్నారు.
హెలిపాడ్ వద్ద మంత్రి కేటీఆర్కు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, రైతు రుణ విమోచన కార్పొరేషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, నగరమేయర్ గుండు సుధారాణి, పోలీసు కమిషనర్ ఏవీ రంగనాథ్, కలెక్టర్ సిక్తాపట్నాయక్, జాయింట్ కలెక్టర్ మహేందర్జీ పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.