పర్వతగిరి, జనవరి 20 : అన్నారం షరీఫ్లో శుక్రవారం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎస్సై దేవేందర్ కథనం ప్రకారం.. ఖమ్మం నగరానికి చెందిన ఎండీ రఫీ కొత్త కారు కొనుగోలు చేసిన సందర్భంగా అన్నారం షరీఫ్ దర్గాకు వచ్చాడు. దర్శనం అనంతరం వెళ్తుండగా, తొర్రూరు ప్రధాన రహదారిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బ్రేక్ వేయబోయి, ఎక్స్లేటర్ తొక్కాడు. దీంతో కారు పక్కనే ఉన్న షాపుల పైకి దూసుకెళ్లడంతో పాటు పలువురిని ఢీకొట్టింది. దీంతో మహ్మద్ గౌస్పల్లికి చెందిన చింతనిప్పుల నందిని, బుచ్చన్న, చింటు, దస్రు, అన్నారానికి చెందిన మునుకుంట్ల మాలతికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను స్థానికులు తొర్రూలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. కాగా, తీవ్ర గాయాలైన నందిని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. కాగా, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్రావు దవాఖానకు వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.