కాజీపేట/హనుమకొండచౌరస్తా, నవంబర్ 21: వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానని, తనను మరోసారి ఆశీర్వదించాలని ప్రభుత్వ చీఫ్విప్, బీఆర్ఎస్ పశ్చిమ అభ్యర్థి దాస్యం వినయ్భాస్కర్ కోరారు. పశ్చిమ నియోజకవర్గం కాజీపేట పట్టణం 62వ డివిజన్లోని రహిమత్నగర్, శ్వేతార్క కాలనీ, విష్ణుపురి, సోమిడి తదితర కాలనీల్లో మంగళవారం ఆయన గడపగడపకూ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో శానస మండలి డిఫ్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాశ్, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, పశ్చిమ కన్వీనర్ జనార్దన్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
అలాగే, దాస్యం వాక్ అండ్ టాక్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కాకతీయ యూనివర్సిటీలో వాకర్స్తో కలిసి వాకింగ్ చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. తనతోపాటు కేయూ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శంకర్, వాకర్స్ అసోసియేషన్ గవర్నర్ కుమారస్వామి, ఎల్లాగౌడ్, విజయ్ పాల్గొన్నారు. అంతేకాకుండా దాస్యం 59వ డివిజన్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. డివిజన్లో పార్కులు, ఓపెన్ జిమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. సీసీరోడ్లు, డ్రైనేజీల వ్యవస్థ మెరుగుపడిందన్నారు.