హనుమకొండ, డిసెంబర్ 10 : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధి పరాకాష్టకు నాంది పలుకుతున్నారని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వినయ్భాసర్ సారథ్యం లో అధికారికంగా నిర్మించిన క్యాంపు కార్యాలయానికి సంబంధించిన శిలాఫలకాన్ని నాయిని రాజేందర్రెడ్డి అనుచరు లు దౌర్జన్యంగా ధ్వంసం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో అధికారికంగా చేపట్టిన శిలాఫలకాన్ని ధ్వంసం చేయడం రా జ్యాంగ విరుద్ధమని, నాయిని రాజేందర్రెడ్డిపై అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బాలసముద్రంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో నాయిని రాజేందర్రెడ్డి అడుగు పెట్టిన తొలి రోజే ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా వ్యవహరించారని ఆరోపించారు. పరిపాలనకు కేంద్ర బిందువు అయిన క్యాంపు కార్యాలయంలోనే అధికార దుర్వినియోగం చేస్తున్నారని, మున్ముందు నియోజకవర్గ పరిధిలో ఇంకెంత దౌర్జన్యానికి పాల్పడుతారో అని బీఆర్ఎస్ శ్రేణులు, నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిలాఫలకం ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణమైన వారందరినీ చట్ట రీత్యా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, హనుమకొండ జిల్లా కలెక్టర్, వరంగల్ పోలీసు కమిషనర్ను సామాజిక మాధ్యమాల ద్వారా నియోజక వర్గ ప్రజలు కోరారు.