హనుమకొండ సబర్బన్, డిసెంబర్ 28: దేశం లో రైతు ప్రభుత్వాన్ని స్థాపించి రైతులందరూ సుఖసంతోషాలతో ఉండేలా చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకు పోతున్నారని రాష్ట్ర ప్ర ణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినో ద్కుమార్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చివేసి దేశ రాజకీయాల్లో కీలక పాత్రపోషించేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పారు.
బుధవారం హుస్నా బాద్ నియోజక వర్గ కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమా వేశానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్, జడ్పీ అధ్యక్షుడు మారెప ల్లి సుధీర్ కుమార్, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్రెడ్డి, నారదాసు లక్ష్మణ్రావుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్తో దేశం లో తెలంగాణ సత్తా ఏమిటో చూపిస్తామని అన్నా రు. రాష్ట్ర లక్ష్యాలైన నీళ్లు, నిధులు, నియామ కా లను సాకారం చేసిన ఘనత సీఎం కేసీఆర్దే న న్నారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందన్నారు. రైతుబంధుకు రూ.7వేల కో ట్లు యాసంగిలో ఇచ్చామన్నారు. 50 మెడికల్ క ళాశాలలను ఏర్పాటు చేశామని తెలిపారు. హు స్నాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శం గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు.