కరీమాబాద్, అక్టోబర్ 29: యువత బీఆర్ఎస్ వైపు చూస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. కరీమాబాద్లో ఆదివారం పలువురు యువకులు నన్నపునేని సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం నరేందర్ మాట్లాడుతూ యువతకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించిన ఘనత బీఆర్ఎస్దే అన్నారు. సుమారు 55 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ తూర్పు నియోజకవర్గంలో చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. యువతకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న టీఆర్ఎస్కు అన్ని వర్గాల వారు మద్దతుగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ తెలిపారు.
ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణలో టీఆర్ఎస్కు ఎదురులేదని నన్నపునేని అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారన్నారు. పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి అండగా ఉంటామన్నారు. పార్టీ కోసం పని చేసే వారికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదన్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల కుటిల రాజకీయాలు ప్రజలకు తెలుసునన్నారు. బీఆర్ఎస్ సర్కారు ప్రజల కోసం చేస్తున్న పనులను క్షేత్రస్థాయిలో వివరించాలని కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్నే ప్రజలు మరోసారి కోరుకుంటున్నారన్నారు. కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ యోగక్షేమాల కోసం కృషి చేస్తానన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తున్నదని కొనియాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో మంత్రి కేటీఆర్ అండదండలతో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశానన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పల్లం పద్మ, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు పొగాకు సందీప్, పూజారి విజయ్. మీరిపెల్లి వినయ్, బోరిగం నర్సింగం నాయకులు మేడిది మధుసూదన్, ముష్కమల్ల సుధాకర్, మండ శ్యామ్ పాల్గొన్నారు.
గిర్మాజీపేట/పోచమ్మమైదాన్: సీఎం కేసీఆర్ జనరంజక పాలనను చూసి వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయని, ప్రజలంతా సంక్షేమ ప్రభుత్వమైన బీఆర్ఎస్ వైపే ఉన్నారని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. శివనగర్లోని క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు పెండెం శ్రీధర్, సునీల్ ఆధ్వర్యంలో నులుక మల్లికార్జున్, చిట్టిమల్ల కార్తీక్, సిరబోయిన రాజేందర్, చిలకమని దిలీప్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ యెలుగం సత్యనారాయణ, వెంకటేశ్, రవికుమార్, గణేశ్, సాయినిఖిల్, శ్రీకాంత్ పాల్గొన్నారు. అలాగే, 25వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు శిరీషా-శ్రీమాన్ సమక్షంలో రేణుకా ఎల్లమ్మతల్లి ఆలయ ఆవరణలో ప్రతాప్యాదవ్తోపాటు ధర్ములు, కుమార్, కృష్ణమూర్తి, శ్రీను, సునీల్, సది, షరీఫ్తోపాటు మరో 40 మంది ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వరంగల్ 12వ డివిజన్ దేశాయిపేటలో వివిధ పార్టీల నుంచి ఎమ్మెల్యే నరేందర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కావటి కవితా రాజుయాదవ్, డివిజన్ ఇన్చార్జి యెలుగం శ్రీనివాస్, పార్టీ డివిజన్ అధ్యక్షుడు సోల రాజు, యూత్ నాయకుడు రాంకి, కార్యకర్తలు పాల్గొన్నారు.