భూపాలపల్లి రూరల్ : భూపాలపల్లి పట్టణంలోని సుభాష్కాలనీ, రాంనగర్లో బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సుధీర్కుమార్ బజ్జీలేస్తూ.. ఇస్త్రీ చేస్తూ, ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించాడు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి ప్రచారం చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజల గొంతుకనై పార్లమెంట్లో మన సమస్యలను వినిపిస్తానని సుధీర్కుమార్ పేర్కొన్నారు.