కరీమాబాద్, నవంబర్ 27: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారుతోనే గుడిసెల కాలనీలు అన్ని విధాలా అభివృద్ధి చెందాయని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు అభ్యర్థి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 42వ డివిజన్లోని లెనిన్ నగర్లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నన్నపునేని మాట్లాడుతూ గుడిసె వాసులకు పట్టాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్దేనన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.
రాష్ట్రంలో మళ్లీ అభివృద్ధి కొనసాగాలన్నా.. అర్హులకు సంక్షేమ పథకాలు అందాలన్నా మరోమారు కేసీఆర్ సీఎం కావాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో తాను తూర్పును ఎంతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాలనీల్లో మహిళలు నన్నపునేనికి మంగళహారతులతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గుండు చందన, డివిజన్ అధ్యక్షుడు కర్ర కుమార్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మరోసారి బీఆర్ఎస్దే అధికారమని ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. 32వ డివిజన్లో కార్పొరేటర్ పల్లం పద్మ-రవి ఆధ్వర్యంలో పలు పార్టీల నుంచి నాయకులు పార్టీలో చేరగా, వారికి నన్నపునేని గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. తెలంగాణలో ఇతర పార్టీలు ప్రజల విశ్వాసం కోల్పోయాయని ఎమ్మెల్యే విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నేతలు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల వారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్నే కోరుకుంటున్నారన్నారు.
గిర్మాజీపేట/పోచమ్మమైదాన్: వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ గెలుపులో భాగస్వాములం అవుతామని 26వ డివిజన్ శివ పరపతి సంఘం సభ్యులు అన్నారు. డివిజన్ ఎన్నికల ఇన్చార్జి కూచన క్రాంతి ఆధ్వర్యంలో మూకుమ్మడిగా నరేందర్కు సంపూర్ణ మద్దతు ప్రకటించి, కారు గుర్తుకు ఓటు వేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలాగే, 50 కుటుంబాలు బీఆర్ఎస్లో చేరగా, వారందరినీ ఎమ్మెల్యే ఆహ్వానించారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ దండు దయాసాగర్, బీఆర్ఎస్ నాయకులు జగన్, కొరివి పరమేశ్, శ్యామల శ్రీనివాస్, బోగం నాగరాజు, పరపతి సంఘం సభ్యులు జక్కోజు మోహన్రావు, బలబద్ర అశోక్, డోర్నాల రమేశ్, సుధాకర్, జగన్, గిరిధర్, రాజేశ్, చందు, రాకేశ్, నవీన్, శివ, ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే, వరంగల్ దేశాయిపేటరోడ్డులోని కేఆర్ గార్డెన్లో గురునానక్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట కార్పొరేటర్లు బస్వరాజు కుమారస్వామి, బాలిన సురేశ్, చింతాకుల సునీల్, నాయకులు, సిక్కు గురువులు పాల్గొన్నారు.
వరంగల్చౌరస్తా: హెల్త్ హబ్గా మారుతున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్కు ఓటు వేసి రౌడీరాజ్యం తెచ్చుకోవద్దని, గత కాంగ్రెస్ పాలకుల మూలంగానే తూర్పు పూర్తిగా వెనకబడిందని నన్నపునేని అన్నారు. ఆదివారం రాత్రి 36వ డివిజన్ చింతల్, పుప్పాలగుట్ట, శాంతినగర్, చంద్రవదన కాలనీ, జ్యోతిబసు కాలనీలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ ఆధ్వర్యంలో ఎన్నిక ప్రచారం నిర్వహించారు. పుప్పాలగుట్ట మహాత్మాగాంధీ విగ్రహ సెంటర్లో ఎమ్మెల్యేను గజమాల, శాలువాలతో సత్కరించారు.
సెంటర్ మొత్తం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. అక్కడ ప్రారంభమైన ప్రచారయాత్ర ముత్యాలమ్మ గుడి నుంచి సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ మూలంగానే తూర్పు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండగా, తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వరంగల్ను ఎంతో అభివృద్ధి చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత మసూద్, డివిజన్ అధ్యక్షుడు వేల్పుగొండ యాకయ్య, నాయకులు మర్రి శ్రీనివాస్, గడల రమేశ్, ఎండీ అంకూస్, అబ్బు, రాజ్కుమార్, రాజారపు అనిల్, గణేశ్, అనిల్, నరేశ్ పాల్గొన్నారు.
గిర్మాజీపేట: సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభు త్వం ముదిరాజ్ల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్ అన్నారు. రాజశ్రీ గార్డెన్లో సోమవారం ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ బయ్యా స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి నరేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ నెల 30న జరుగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నన్నపునేనిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఏకగ్రీవ తీర్మానం చేశారు. ముదిరాజ్ల సొసైటీ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్, కార్పొరేటర్ చింతాకుల అనిల్, జడ్ ఆర్సీ మెంబర్ చింతాకుల సునీల్, బీఆర్ఎస్ నాయకులు కలకొండ అభిలాష్, భిక్షపతి, ఉమేశ్, వాసు, సాంబయ్య, సదానందం, రాజన్బాబు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఖిలావరంగల్: బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్కు వరంగల్ జిల్లా లారీ ఓనర్స్, ఓరుగల్లు లారీ ఓనర్స్, కాకతీయ ఇసుక లారీ ఓనర్స్ సంఘాలు సంయుక్తంగా మద్దతు ప్రకటించాయి. మూడు సంఘాల ఓనర్లు కారు గుర్తుకు ఓటు వేసి నన్నపునేనిని గెలిపిస్తామని ఎమ్మెల్యే సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు. నియోజకవర్గంలో లారీలు నిలుపుకోవడానికి ట్రక్ టర్మినల్ ఏర్పాటు చేస్తామని, అసోసియేషన్ భవనం కోసం దేశాయిపేటలో 300 గజాల స్థలం కేటాయిస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా లారీ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల భూపాల్, జాకిద్, శివకుమార్, హుస్సేన్, ఓరుగల్లు లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ ఫిరోజ్అలీ, అజ్మత్, బౌరిశెట్టి నారాయణ, చుంచు రాజు, బీఆర్ఎస్ నాయకులు ఎస్డీ మసూద్, శిరీష్, రాజనాల శ్రీహరి పాల్గొన్నారు.