ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బడే నాగజ్యోతి తెల్ల కాగితంలాంటిందని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. శుక్రవారం నాగజ్యోతి నామినేషన్ దాఖలు చేయగా మంత్రి సత్యవతిరాథోడ్, ములుగు ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్నాయక్ హాజరయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నాగజ్యోతికి నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉన్నదన్నారు. ఆడబిడ్డగా గుండెల్లో పెట్టుకొని ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. సీతక్క ఎమ్మెల్యేగా షోపుటప్ రాజకీయాలు తప్ప ప్రజలకు మేలు చేసే పనులు ఒక్కటి కూడా చేయలేదని విమర్శించారు. ఎన్నికల ఖర్చు కోసం దేశ విదేశాల్లో చందాలు వసూలు చేసి రాజకీయం చేస్తున్నదని ఆరోపించారు. ఓటమి అంచుల్లో ఉన్న ఆమెకు ఏం మాట్లాడాలో అర్థంకావడంలేన్నారు. నాగజ్యోతి మాట్లాడుతూ తల్లిదండ్రులు లేని నాకు ములుగు ప్రజలు తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్లు, అక్క చెల్లెళ్ళు అని భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు. తాను సీఎం కేసీఆర్ నుంచి బీఫాం తీసుకునానని, ప్రజల తరుపున నామినేషన్ వేసినట్లు తెలిపారు. నా గెలుపు ప్రజల గెలుపని తెలిపారు.
ములుగు, నవంబర్10 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ములుగు నియోజకవర్గ ఎన్నికల్లో నిలిచిన బడే నాగజ్యోతి తెల్ల కాగితం లాంటి మంచి నాయకురాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం నాగజ్యోతి నామినేషన్ సందర్భంగా ములుగులోని అద్దె ఇంట్లో ఉంటున్న ఆమెకు ముస్లిం మహిళలు మసీదులో ప్రార్థనలు చేసి తీసుకొచ్చిన దట్టిని కట్టారు. అనంతరం నాగజ్యోతి జిల్లా కేంద్రంలోని శివాలయంలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేశారు. అక్కడి నుంచి మొదటి మొక్కుల తల్లి గట్టమ్మ ఆలయానికి చేరుకొని మంత్రి సత్యవతిరాథోడ్, ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, రెడ్కో చైర్మన్, మండల ఎన్నికల ఇన్చార్జి వై సతీశ్రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్నాయక్, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవీ సుధీర్యాదవ్తో కలిసి పూజలు చేశారు. గట్టమ్మ వద్ద నామినేషన్ పత్రాలను ఉంచి విజయం సాధించేలా ఆశీర్వదించాలని వేడుకు న్నారు. అక్కడి నుంచి వేలాది మంది కార్యకర్తలతో భారీ రాలీగా ఆర్అండ్బీ గెస్ట్హౌస్లోని ఎన్నికల రిటర్నింగ్ కా ర్యాలయానికి చేరుకున్నారు. మంత్రి సత్యవతిరాథోడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద్నాయక్, జడ్పీటీసీ సకినాల భవానీతో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి అంకిత్కు అందజేశారు. అనంతరం మంత్రి సత్యవతి మాట్లాడు తూ బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడి అమరులైన తల్లిదండ్రుల వారసత్వాన్ని పునికిపుచ్చుకొని రాజకీయ ప్రవేశం చేసిన నాగజ్యోతికి ములుగు నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉందన్నారు. చిన్న తనం నుంచి సమస్యలు, ఇబ్బందులను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి అన్నారు. నాగజ్యోతిని సీఎం కేసీఆర్ నిండు మనస్సుతో ఆశీర్వదించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉంచారని తెలిపారు. ప్రజలు నాగజ్యోతిని ఇంటి ఆడబిడ్డగా గుండెల్లో పెట్టుకొని ఓటు వేసి గెలిపించాలని కోరారు.
ములుగు ఎమ్మెల్యేగా సీతక్క షోపుటప్ రాజకీయాలు చేయడమే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కరోనా, వరదల సమయంలో చందాలు వసూలు చేసిబాధితులకు పంచినట్లు చేసిన సీతక్క ఇప్పుడు ఎన్నికల ఖర్చుల కోసం దేశ విదేశాల్లో పర్యటించి అక్కడి నుంచి భారీ ఎత్తున చందాలు వసూలు చేసి ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు బీఆర్ఎస్పై నిందలు వేస్తున్నారన్నారు. ఓటమి అంచుల్లో ఉన్న సీతక్క ఇతర ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం ఏంటని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీతక్కకు బీ ఫాం ఇచ్చేందుకు, గెలుపును కోరుతూ నియోజకవర్గానికి ఢిల్లీ నాయకులు వచ్చిన విషయాన్ని మరిచి సీతక్క మాట్లాడడం ఆమె అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఇన్చార్జి మంత్రిగా నాగజ్యోతి గెలుపునకు పూర్తి బాధ్యత తనపై ఉందన్నారు. ములుగులో జరిగిన అభివృద్ధి అంతా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేనన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సీతక్క ఈ ప్రాంత అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయలేదన్నారు. నాగజ్యోతి గెలుపులో తాము శక్తివంచన లేకుడా కృషి చేస్తుండడంతో ఓటమి భయంతో సీతక్కకు వణుకు పుడుతున్నదన్నారు. కార్యక్రమంలో ఓడీసీఎంఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, రోడ్డు భవనాల అభివృద్ధి సంస్థ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, ఎంపీపీలు గండ్రకోట శ్రీదేవీ సుధీర్ యాదవ్, వాణిశ్రీ, అంతటి విజయ, జడ్పీటీసీలు గై రుద్రమదేవి, పార్టీ మండల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ములుగురూరల్, నవంబర్10 : ములుగు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా బడే నాగజ్యోతి శుక్రవారం నాలుగు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం రెండు సెట్లు, మధ్యాహ్నం మరో రెండు సెట్టు రిటర్నింగ్ అధికారికి అందజేశారు. రెండు నామినేషన్లను కాకులమర్రి లక్ష్మీనర్సింహరావు బలపర్చగా మూడో నామినేషన్లో రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి బలపర్చారు. నాల్గో నామినేషన్లో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్నాయక్ బలపర్చారు. నామినేషన్ ముందు తండ్రి బడే నాగేశ్వర్రావు అలియాస్ ప్రభాకరన్న చిత్రపటానికి పూలమాలలు వేసి దండం పెట్టుకున్నారు. అలాగే సీఎం కేసీఆర్ చిత్రపటానికి నమస్కారం చేశారు.
తల్లిదండులు నాకు జన్మనిస్తే తండ్రి సమానులైన సీఎం కేసీఆర్ రాజకీయంగా తనకు అండగా నిలిచారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. తెలంగాణ పోరాటంలో పాల్గొని రాష్ర్టాన్ని తెచ్చిన కార్యకర్తలు తన నామినేషన్కు వచ్చారని, వారందరినీ చూస్తుంటే గుండె నిండిందన్నారు. తల్లిదండ్రులు లేని నాకు ములుగు ప్రాంత ప్రజలే తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్లు, అక్కా చెల్లెళ్లు అని భావోద్వేగానికి గురై కంట తడి పెట్టారు. డబ్బు సంచులతో ప్రచారాలు చేస్తున్నారని, నా గెలుపును డబ్బులతో ముడి పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. నాకు సొంత ఇల్లు కూడా లేదని, నా ఆస్తి నియోజకవర్గ ప్రజలేనని తెలిపారు. సీఎం కేసీఆర్ నిండు మనస్సుతో కూతురిగా భుజం తట్టి బీఫాం ఇచ్చారని, దానిని ప్రజలందరి తరుపున తీసుకున్నానన్నారు. ఎమ్మెల్యేగా తాను గెలిస్తే అది నియోజకవర్గ ప్రజల గెలుపేనని తెలిపారు. మనం గ్రామాల్లో నేడు నడుస్తున్న రోడ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వేసినవేనన్నారు. అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. రానున్న ప్రభుత్వం బీఆర్ఎస్దేనని, ములుగు అభివృద్ధి తమతోనే సాధ్యమన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పే కాంగ్రెస్ తో అభివృద్ధి కాదని నాగజ్యోతి స్పష్టం చేశారు.