సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై అన్నివర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. పేదల అభ్యున్నతి, సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని పథకాలను ఇప్పటికే అమలు చేస్తుండగా, వాటిని విస్తృత పరచడంతోపాటు వారికి అండగా నిలిచేలా మ్యానిఫెస్టోను రూపొందించారని సంబురపడుతున్నారు. అర్హులైన మహిళలకు రూ.3వేల భృతి, రూ.400కే వంట గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ వైద్య మొత్తాన్ని రూ.5లక్షల నుంచి రూ.15లక్షలకు పెంచుతామనడం ఆకట్టుకుంటున్నాయి. తెల్లరేషన్కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ, రూ.5లక్షల బీమా, ఆసరా పింఛన్ మొత్తం, రైతుబంధు కింద పంట పెట్టుబడి సాయం పెంచుతుండడాన్ని స్వాగతిస్తున్నారు.
హనుమకొండ సబర్బన్ : నాకు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏటా పంటలు వేసే సమయంలో దుక్కి దున్నడానికి, ఎరువులకు, విత్తనాలకు, నాట్లు వేయడానికి పెట్టుబడులకు ఇబ్బంది ఉండేది. సావుకార్ల దగ్గర అప్పులు తెచ్చి పంటలు వేసేది. కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుబంధు కింద మొదట్లో ఎకరానికి రూ.8వేల చొప్పున రూ.20వేలు వచ్చినవి. ఆ తర్వాత ఎకరానికి రూ.10వేల చొప్పున రూ.25వేలు బ్యాంకు ఖాతాలో పడుతున్నాయి. రైతుల గురించి ఆలోచించే ఏకైక సీఎం కేసీఆర్. రైతుబంధు పైసలు ఎకరాకు రూ.16వేల వరకు తీసుకుపోతా అని ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించడం సంతోషంగా ఉంది. దీని వల్ల నాకు ఎకరానికి ఏటా రూ.40వేలు వస్తాయి. నాకు పెట్టుబడి ఖర్చు దాదాపు రైతుబంధుతోటే సరిపోతది. రైతులందరూ కూడా ఆలోచించి మన గురించి పని చేసెటోళ్లను ఆశీర్వదించాలె. సీఎం కేసీఆర్ మాట ఇచ్చిండంటే తప్పెటోడు కాదు.
వరంగల్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత రాష్ట్ర సమితి మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే నంబర్ వన్గా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి ఊరు, బస్తీని సమగ్రంగా అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు జరిగిన అభివృద్ధిని కొనసాగించడంతోపాటు సంక్షేమ పథకాలను మరింత విస్తృతం చేస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ మ్యానిఫెస్టోను ఇటీవల ప్రకటించారు. అందులోని అంశాలపై అన్నివర్గాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పథకాలను మరింత విస్తృతం చేయడంతోపాటు అన్నివర్గాలకు అండగా నిలిచేలా మ్యానిఫెస్టో ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు పూర్తిగా స్వాగతిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఎక్కడా..ఎవరూ అమలు చేయలేదని అంటున్నారు. పేదల అభ్యున్నతికి మరింత తోడ్పాటు అందించేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు. రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం ఇస్తామని ప్రకటించడంపై నిరుపేద కుటుంబాలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు తెల్లకార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.5లక్షల బీమా అమలు చేస్తామని పేర్కొనగా, బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించనున్నది.
ప్రస్తుతం అమలవుతున్న రైతు బీమా తరహాలోనే ప్రతి పేద కుటుంబానికి ఈ పథకం వర్తించనున్నది. రాష్ట్రంలో ప్రస్తుతం 46లక్షల మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉండగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్ ఇవ్వడంతోపాటు ఇప్పుడు ఇస్తున్న మొత్తాన్ని పెంచనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం రూ.2,016 ఉన్న పింఛన్ను బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వచ్చిన మొదటి ఏడాదిలో రూ.3,016 కు, ఆ తర్వాత ఏటా రూ.500 చొప్పున పెంచి రూ.5వే లు చేయనుంది. దివ్యాంగుల పింఛన్ను ఇదే పద్ధతిలో రూ.6,016 వరకు పెంచనుంది. రాష్ట్రంలో 70లక్షల మందికి పంట పెట్టుబడిని సమకూరుస్తున్న రైతుబంధు పథకం కింద ప్రస్తుతం ఎకరానికి రూ.10వేలు ఇస్తుండగా, ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాది రూ.12వేలకు, క్రమంగా రూ.16వేలకు పెంచనున్నా రు. వడ్ల కొనుగోలు ప్రక్రియను యథావిధిగా కొనసాగించనున్నట్లు ప్రకటించారు. మహిళా సంక్షేమం విషయంలో బీఆర్ఎస్ మరోసారి ప్రత్యేకతను చాటుకున్న ది. అర్హులైన మహిళలకు ప్రతి నెల రూ.3వేల చొప్పున భృతి ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం చర్యలతో వంట గ్యాస్ సిలిండర్ భారం ప్రస్తుతం మో యలేని విధంగా తయారైంది. వంట గ్యాస్ ధరల నుం చి ఉపశమనం కల్పించేలా బీఆర్ఎస్ ప్రత్యేక విధానాన్ని తేనున్నది. పేద మహిళలకు రూ.400కు గ్యాస్ సిలిండర్ సరఫరా చేయనున్నట్లు మ్యానిఫెస్టోలో ప్రకటించింది.
మహిళా సమాఖ్యలకు సొంత భవనాలు నిర్మించనున్నారు. ఉచిత విద్య, వైద్యం దిశగా బీఆర్ఎస్ ప్ర భుత్వం ఇప్పటికే ఎన్నో విధానాలను అమలు చేస్తున్నది. ఉచిత వైద్య ప్రక్రియలో భాగంగా ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం అందించే మొత్తాన్ని రూ.5లక్షల నుం చి రూ.15లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పేదలకు ఇండ్ల స్థలాలను కేటాయించడంతోపాటు ప్రస్తుతం అమలవుతున్న హౌసింగ్ విధానాన్ని కొనసాగించనున్నట్లు బీఆర్ఎస్ పేర్కొన్నది. సామాజిక సమతూకం దిశగా బీఆర్ఎస్ మరో కీలక విషయాన్ని మ్యానిఫెస్టోలో చేర్చింది. అగ్రవర్ణాల్లోని పేదల చదువుల కోసం ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకులాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అనాథ పిల్లల సంక్షేమం కోసం ప్రత్యేక విధానాన్ని అమలు చేయనున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగుల సీపీఎస్పై అ ధ్యయన కమిటీని నియమించనున్నట్లు బీఆర్ఎస్ పే ర్కొన్నది. అసైన్ ల్యాండ్ హక్కులపై ప్రత్యేక విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. మైనారిటీల సంక్షేమంలో దేశంలోనే ఆదర్శంగా ఉన్న బీఆర్ఎస్ ప్రభు త్వం దీన్ని మరింత విస్తృతం చేసేలా చర్యలు తీసుకోకున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అన్ని వర్గాలకు వర్గాలకు మరింత తోడ్పాటు అందించేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉండడంతో సర్వత్రా ఆమోదం వస్తున్నది.
సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోను ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. కేసీఆర్ సార్ ప్రకటించిన మ్యానిఫెస్టో అదిరిందని.. దీని వల్ల పేదలకు ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ మరో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అంటున్నారు. సామన్య ప్రజలు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను చూసి సంబుర పడుతున్నారు. అందులోని పథకాలతో తమకు మరింత మేలు జరుగుతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పలువురు తమ అభిప్రాయాలను ‘నమస్తే’తో పంచుకున్నారు.
కమలాపూర్ : మా గ్రామంలో నాకు రెండు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఏటా రైతుబందు పథకంలో డబ్బులు వస్తున్నయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టిన ఎన్నికల మేనిఫెస్టోలో పథకాలు బాగున్నయ్. రైతుల కోసం రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరెంటు సరఫరాతో రైతులు పంటలు పండించుకుంటున్నరు. గతంలో ఏ ప్రభుత్వం రైతుల గురించి పట్టించుకోలేదు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కేసీఆర్ బీమా ఇంటింటికీ ధీమా అవుతుది. ఆరోగ్యశ్రీ రూ.15లక్షలకు పెంపు, సౌభాగ్య లక్ష్మితో మహిళలకు రూ.3వేలు, రూ.400లకే గ్యాస్ సిలిండర్ పంపీణీ చేస్తామని చెప్పడం బాగుంది. కేసీఆర్ మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలను పకడ్బందీగా అమలు చేస్తే పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది.
ఆత్మకూరు : సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను తెలంగాణ ప్రజలందరి అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టారు. తెలంగాణ కోసం పోరాడిన వారందరూ సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతోనే దీన్ని ప్రవేశపెట్టారు. కేసీఆర్ మాటకు తిరుగుండదు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అద్భుతంగా ఉంది. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావడం ఖాయం. ఆయన తీసుకొచ్చే ప్రతి పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిని మూడోసారి గెలుపించుకొని మరింత అభివృద్ధి చేసుకుంటాం.
గులను చిన్న చూపు చూసేది. కుటుంబంలో ఇబ్బందులు ఉండి చాలా కష్టాలు పడేది. గత ప్రభుత్వాలు రూ.200 పింఛన్ ఇచ్చేది. అవి మాకు చిల్లరకు కూడా సరిపోయేవి కావు. బతకడానికే ఇబ్బంది పడేది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా గెలిచినంక దివ్యాంగులకు రూ.4వేల పింఛన్ ఇస్తూ మాకు భరోసా ఇచ్చారు. బ్యాటరీ ద్విచక్రవాహనాలు ఇచ్చిండు. ప్రజల్లో దివ్యాంగులకు గౌరవం కల్పించిండు. మళ్లా కేసీఆర్ ఎన్నికల్లో గెలిస్తే పింఛన్ రూ.6వేలు ఇస్తానంటుండు. కేసీఆర్ మాటకు తిరుగుండదు. దివ్యాంగులకు న్యాయం చేసే వ్యక్తిని ఎలా వొదులుకుంటాం? వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేసి, ఆయన రుణం తీర్చుకోవాలి.
శాయంపేట : కేసీఆర్ సారు రైతులకు ఎంతో చేస్తాండు. ఆ సార్నే మళ్లీ గెలిపించుకుంటం. ఎమ్మెల్యేగా గండ్ర వెంకటరమణారెడ్డిని గెలిపించుకుంటం. కేసీఆర్ సారు సీఎంగా మళ్లీ రావాలే. రైతు బాంధవుడిగా కేసీఆర్ అండగా నిలుస్తాండు. మ్యానిఫేస్టోలో రైతుబంధు రూ.16వేలకు పెంచుతామని ప్రకటించడం ఇందుకు నిదర్శనం. రైతులు పడుతున్న ఇబ్బందులు కేసీఆర్ సారుకు ఎక్కువ తెలుసు. అందుకే రైతుబంధుతో రూ.10వేలు ఇస్తున్నడు. నాకు ఆరు ఎకరాలు భూమి ఉంది. ఏటా రైతుబంధు వస్తున్నది. బయట అప్పు లేకుండా సాగు చేసుకుంటున్న. ఇన్నేండ్లలో ఇట్ల ఆలోచించిన నాయకుడు ఎవరూ లేరు. తెలంగాణ రైతులు పుణ్యం చేసుకున్నరు కాబట్టే కేసీఆర్ సారు ముఖ్యమంత్రిగా వచ్చిండు. అందరూ బీఆర్ఎస్కు మద్దతుగా నిలబడాలి.
హనుమకొండ సిటీ : ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం పొందుతున్న నిరుపేద ప్రజలకు వైద్య ఖర్చులను రూ.5లక్షల నుంచి 15లక్షలకు పెంచడం శుభపరిణామం. బీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో వైద్య ఖర్చులను పెంచడం సంతోషించాల్సిన విషయం. ఒక నిరుపేద కుటుంబానికి ఆపద వచ్చి దవాఖానలో చేరితే, ప్రభుత్వం రూ.15 లక్షలు చెల్లించేందుకు ముందుకు వచ్చిన చరిత్ర ఇప్పటి వరకు లేదు.
వరంగల్ : కేసీఆర్ మాట ఇచ్చిడంటే పని అయినట్లే.. గత పాలకులు మ్యానిఫెస్టోలో ఇచ్చిన హమీలు మరిచిపోయారు. కేసీఆర్ గతంలో చెప్పివన్ని చేసిండు. మళ్లీ ప్రకటించిన కొత్త పథకాలను చేస్తడు. ఆసరా పించన్లు రూ.2016 ఇస్తానని మాట ఇచ్చిండు.. ఇచ్చి సూపిచ్చిండు. ఇప్పుడు ప్రకటించినట్లు ఐదేళ్లలో రూ.5వేలు ఇచ్చి చూపిస్తడు. గత పాలకులకు, కేసీఆర్కు అసలు పొంతన లేదు. కేసీఆర్ అయితనే చెప్పుతడు. చేప్పింది చేస్తడు. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో బాగుంది. కేసీఆర్ బీమా, సౌభాగ్యలక్ష్మి పథకాలు దేశంలో ఎక్కడా లేవు. పేదల బతుకులు బాగుపడాలనే తపన కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలో కనిపిస్తోంది. ఆసరా పింఛన్లు పెంచడం వృద్ధుల్లో ధైర్యం నింపుతుంది. సౌభాగ్య లక్ష్మి పథకం మహిళల ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. సీఎం కేసీఆర్ ప్రజా మ్యానిఫెస్టోను ప్రకటించారు.
హనుమకొండ : కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో చాలా అద్భుతంగా ఉంది. ఏ పార్టీలు అమలు చేయని పథకాలు ఆయన అమలు చేస్తున్నారు. ఈ తొమ్మిదేళ్లలో రాష్ర్టా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, దేశానికి ఆదర్శంగా నిలిపారు. గత మేనిఫెస్టోలో లేని పథకాలను కూడా అమలు చేసి చూపించారు. ఒక నిరుపేద కుటుంబం మూడు నుంచి నాలుగు పథకాలతో లబ్ధి పొందేలా ఉంది ఇప్పుడు ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం అందించడం, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.15లక్షల ఉచిత వైద్య సౌకర్యం కల్పించడం, రూ.400కు గ్యాస్ సిలిండర్, పేద మహిళలకు నెలకు రూ.3వేల భృతి లాంటివి ఎంతో అద్భుతం. మూడోసారి తప్పకుండా కేసీఆర్ సీఎం అవుతారు.
ధర్మసాగర్ : సీఎం కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టోలో రైతు బంధు పథకంలో ఇచ్చే పైసలు పెంచడం చాలా సంతోషంగా ఉంది. పెట్టుబడి కింద ఇచ్చే ఈ పైసలు రైతుల పంటల సాగుకు ఎంతగానో ఉపయోగపడతాయి. దీంతో వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు లబ్ధి చేకూరుతుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా రైతులను ఆదుకునేందు కోసం ఇలాంటి పథకాలను తీసుకురాలేదు. రైతుల గురించి పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేస్తున్నారు. పంటల పెట్టుబడి కోసం ఇచ్చే ఆర్థికసాయాన్ని రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ప్రతి పథకాన్ని మరింతగా రెట్టింపు చేయడం చాలా సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం.
న్యూశాయంపేట : తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మేనిఫెస్టో రూపొందించారు. ఆయన ఆలోచన గొప్పగా ఉంది. అన్ని వర్గాలకు ఉపయోగపడేలా ఉంది. రెండుసార్లు మ్యానిఫెస్టోలో రూపొందించిన హామీలను నెరవేర్చడంతో పాటు, ఇవ్వని హామీలు కూడా నెరవేర్చుండు సీఎం కేసీఆర్. ఆయన నిర్ణయం ప్రజల మేలు కోసమే. ఆయనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మళ్లీ కేసీఆర్ సీఎం కావాలి. మేనిఫెస్టోలో ఆరోగ్యశ్రీ పరిధి పెంచడం నిరుపేదలకు గొప్ప వరం.
వర్ధన్నపేట : ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నడు. సమాజం కోసం పనిచేసే పాత్రికేయులకు కూడా సహకారం అందించేందుకు సీఎం మ్యానిఫెస్టోలో రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం సంతోషంగా ఉంది. అంతేకాక హెల్త్కార్డులు, ఇండ్లను కూడా చాలా చోట్ల ఇస్తున్నరు. దీనివల్ల పేద కుటుంబాలకు చెందిన జర్నలిస్టులకు ఉపయోకరంగా ఉంటున్నది. నేను 30 ఏళ్లు జర్నలిస్టుగా పనిచేసిన. కానీ, ఏ సీఎం కూడా జర్నలిస్టుల సంక్షేమం గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. ఆసరా పింఛన్ను కూడా రూ.5వేల వరకు పెంచేలా సీఎం నిర్ణయం తీసుకోవడం చాలా బాగుంది. దీంతో వృద్ధులు ఆత్మగౌరవంతో జీవిస్తారు. రైతులు, మహిళలకు కూడా సహకారం అందించేలా మేనిఫెస్టోను తయారు చేయడం అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది.
హనుమకొండ చౌరస్తా : బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాస్ ధర బాగా పెంచింది. మళ్లీ కట్టెలపొయ్యి దిక్కైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. పేదల ఆర్థిక పరిస్థితులు, వారి జీవితం గురించి తెలిసిన వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతి పేద మహిళకు రూ.400కే గ్యాస్ అందిస్తామనడం సంతోషకరం.
కాజీపేట : తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం ఇస్తామని మ్యానిఫెస్టోలో కేసీఆర్ పెట్టడం మంచిగున్నది. కేసీఆర్ నిర్ణయం వల్ల సన్న బియ్యం తినే భాగ్యం పేద కుటుంబాలకు దక్కుతుంది. చెప్పంది చేయడంలో కేసీఆర్ను మించిన వారు లేరు. ఇప్పటికే ప్రతి వ్యక్తికి ఆరుకిలోల బియ్యం ఇస్తున్నారు. రాష్ర్టాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా సీఎం కేసీఆర్ మార్చిండు. ఆయన ఏ నిర్ణయమైనా అన్ని ఆలోచించే తీసుకుంటాడు. ఆయన గెలిచిన వెంటనే సన్న బియ్యం రేషన్ ద్వారా ఇవ్వాలని కోరుతున్నాం.
ఖిలావరంగల్ : వేయి రూపాయల నుంచి 2 వేలకు పింఛన్ పెంచి కేసీఆర్ సార్ ఇస్తాండు. తొమ్మిదేళ్ల నుంచి నేను నా బిడ్డ భాగ్య ఇద్దరం పింఛన్ తీసుకుంటున్నాం. ఎన్నికల తర్వాత మూడు వేలు ఇస్తానని మాట ఇచ్చిండు. వచ్చే ఐదేళ్ల వరకు ఐదు వేలకు పెంచుతానని మాట ఇచ్చిండు. కేసీఆర్ ఇచ్చిన మాట తప్పకుండా నిలుపుకుంటడు. నా బిడ్డకు ఒంటరి మహిళ కింద పింఛన్ తీసుకుంటాంది. కేసీఆర్ మా కుటుంబానికి అన్నం పెట్టిండు. ఇప్పుడు కాంగ్రెసోళ్లు పది వేలు ఇస్తామన్న ఎవరు నమ్మరు. ఎందుకంటే వాళ్లు మాట మీద ఉండరు. అన్నం పెట్టినోళ్లకు సున్నం పెట్టం. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మేము కేసీఆర్తోనే ఉంటం.
నర్సంపేట రూరల్ : సీఎం కేసీఆర్ పేదలకు ఆసరా పథకాన్ని చక్కగా అందించి వారందరికీ ఆసరైతున్నడు. ఇటీవల విడుదల చేసిన బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఆసరా పింఛన్లు ఏటా పెంచుతానని సీఎం కేసీఆర్ ప్రకటించడం సంతోషకరం. ఏ ఆసరా లేని వారికి పింఛన్ పెంచుతూ సీఎం మరింత అండగా నిలిచారు. ప్రస్తుతం రూ.2016 ఫించన్ను ఏటా రూ.500 పెంచుతూ ఐదేండ్లల్లో రూ.5వేల వరకు ఇస్తానని చెప్పడం సంతోషకంగా ఉంది. ఆసరా ఫించన్దారుల పాలిట సీఎం కేసీఆర్ దేవుడిలా నిలిచారు.
ఐనవోలు : సీఎం కేసీఆర్ ఎల్లప్పుడూ అన్ని వర్గాల సంక్షేమం గురించి ఆలోచిస్తుంటారు. సంచలన నిర్ణయాలతో తెలంగాణను దేశంలోనే నంబర్వన్గా నిలిపారు. ఇప్పుడు ప్రకటించిన మ్యానిఫెస్టోలో తెల్లరేషన్ కార్డులు ఉన్న వారికి బీమా ప్రకటించడం సంతోషకరమైన అంశం. దీంతో ఎన్నో పేద కుటుంబాలకు ధీమా కలిగించినైట్లెంది. ఇది ఎవరూ ఊహించని నిర్ణయం, రైతు బీమాతో ఎంత ప్రయోజనం చేకూరుతుందో అదే విధంగా తెల్లరేషన్ ఉన్న కుటుంబాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఆపద సమయంలో ఈ బీమా పేద కుటుంబాలకు ధీమా కానుంది.
ఎల్కతుర్తి : గ్యాస్ వెలిగించి వంట చేయాలంటే భయంగా ఉంది. నాలుగైదు వందలు ఉన్న సిలిండర్ను కేంద్రంలోని ప్రభుత్వాలు పెంచుతూ 12 వందల వరకు తీసుకొచ్చాయి. నెలకు నాలుగైదు సిలిండర్లు వాడే మాలాంటిమధ్య తరగతి ప్రజలకు ఇది ఎంతో భారం. సిలిండర్ ధరలు చూసి కట్టెల పొయ్యిల మీదనే వంటలు కూడా చేసుకుంటున్నారు. గిప్పుడు మళ్లీ కేసీఆర్ గెలిస్తే 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామనడం సంతోషంగా ఉంది. ఈ లెక్కన మా కుటుంబాలపై ఎంతో భారం తగ్గుతుంది. మన బతుకుల గురించి ఆలోచించే నాయకులనే ప్రజలు ఎన్నుకోవాలి. ఈ సారి మహిళలందరూ కూడా సీఎం కేసీఆర్కు అండగా ఉంటారనడంలో సందేహం లేదు.
సుబేదారి : ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు పెద్ద దిక్కులా మారారు. మూసలోళ్లకు పెద్ద కొడుకు అయ్యాడు. ఇప్పటికే పింఛన్లు పెంచి ఇస్తున్నడు. ఇప్పుడు ముసలోళ్లకు రూ.3వేల నుంచి రూ.5వేలు ఇస్తడట. అలాగే, గ్యాస్ సిలిండర్ను కూడా రూ.400లకే ఇస్తడట. ఇలాంటి పథకాలు మునుపు ఎన్నడూ లేవు. ఎట్లాగైనా కేసీఆర్నే గెలిపించుకోవాలి.